ప్రపంచంలో అత్యద్భుతమైన ఫోటో ఏది అంటే ప్రస్తుతం ఇది అని చెప్పయ్యచ్చు. ఎందుకంటే ఈ ఫోటో అంత అద్భుతంగా ఉంది. ఈరోజు దసర. దసరా పండుగా ఒక్క రోజులో జరిపేది కాదు. 9 నవరాత్రులు ఈ పండుగను చేస్తాము. ఈ నేపథ్యంలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనం ఇస్తారు. అయితే చివరి రోజు మ‌హిషాసురుడ‌నే రాక్ష‌సుడి వధించిన రూపంలో మనకు దర్శనం ఇస్తారు. 


అయితే ఆ నిజమైన రూపం మనం కళ్లారా ఎప్పుడు చూడం. ఎప్పుడు శిల్పులు చెక్కే విగ్రహాలను మాత్రమే మనం చూస్తాం. కానీ ఆ విగ్రహాలకు ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో ఈ పిల్లలు ఆలా చేసి చూపించారు. నలుగురు పిల్లలు కలిసి అమ్మవారి అవతారంలో మ‌హిషాసురుడ‌నే రాక్ష‌సుడి వదిస్తున్నట్టు ఫోటో తీయించుకున్నారు. ఆ ఫోటో కాస్త ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా కంట్లో పడింది. 


దీంతో ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తనకు అత్యంత ఇష్టమైన విగ్రహం గురించి ట్వీట్‌ చేస్తూ..' ఇంతకంటే అత్యుత్తమైన మందిరాన్ని, విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు. మానవ సంకల్పం విషయంలో పిల్లలెప్పుడూ ముందే ఉంటారు' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగానే ఈ ఫోటో ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఫోటో అనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: