ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు ప్రజలకు భారం వేయడానికి, ప్రభుత్వ ఆదాయం పెంచుకోడానికా అనే ఆలోచనలా అని వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు సూపర్‌వైజర్‌, సేల్స్‌మెన్‌గా నియమితులైన వారికి పూర్తి అవగాహన లేకపోవడం, ఆన్‌లైన్‌ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడాలిసి వస్తుంది. మద్యం విక్రయాల నిబంధనలు, ధరలు, నిర్దేశిత సమయాలతో దుకాణాల నిర్వహణ అద్వానంగా మారింది. మద్యం దుకాణం సిబ్బంది, మందుబాబులు నుంచి సైతం అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు. రాత్రి 8 గంటలకే దుకాణం మూసివేసినా సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్‌ వివరాలు నమోదుచేసి ఇంటికి వెళ్లడానికి అర్థరాత్రి అవుతుంది.


ఏ రోజుకి సంబంధించిన విక్రయాల అనంతరం ఆ రాజీకి సంబంధించిన అమ్మకాలు, స్టాక్‌ వివరాలు ప్రత్యేక యాప్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉన్నది. సాంకేతిక సమస్య కారణంగా నమోదు కాకపోవడంతో సిబ్బంది ఒక ఇంత అసహనం వ్యక్తం చెందుతున్నారు. సాంకేతిక సమస్య కారణంగా ప్రస్తుతానికి మాన్యువల్‌గా వివరాలు నమోదుచేయడానికి వెసులుబాటు కల్పించడం వీరికి కాస్త ఉపశమనం కలిగించింది అని చెప్పుకోవాలి. కాగా మద్యం విక్రయించిన సొమ్ము ప్రభుత్వానికి అప్పగించడంలో కొందరు సూపర్‌వైజర్లు ఇబ్బందులు చెందుతున్నారు. 


అర్థరాత్రి వేళ ఇంటికి వెళుతున్న సూపర్‌వైజర్లు మద్యం విక్రయ సొమ్ము వెంట తీసుకెళ్లి మరుసటి రోజు బ్యాంక్‌లో జమ చేస్తున్నారు. అర్థరాత్రి అంత సొమ్ము వెంట తీసుకెళ్లడంపై కొందరు జంకుతున్నారు. రాత్రి పూట దుకాణ సమయం ముగిసే సమయంలో బ్యాంక్‌ ఉద్యోగి నేరుగా దుకాణం వద్దకు వచ్చి సొమ్ము జమ చేసే విధానం అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. మరోవైపు ఎనిమిది గంటలకే దుకాణాలు మూసివేయడంపై మందుబాబులు కొన్ని దుకాణాల వద్ద వారి ప్రతాపం చూపిస్తున్నారు.
 
కాగా ప్రభుత్వ మద్యం దుకాణ ఏర్పాటు వెనుక ఆదాయం ఆర్జన ప్రధాన ఉద్దేశమనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రైవేటు వ్యాపారులు ఎమ్మార్పీ కంటె అధికంగా వసూలు చేస్తే అధికారులు దాడులు చేసి చర్యలు చేబడుతున్నారు. ప్రస్తుతం నేరుగా ప్రభుత్వమే నిర్దేశిత ధరకు మించి వసూలే చేయడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వమే ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తున్నారు. మొత్తానికి  సామాన్యులకు అందుబాటులో లేని మద్యం రకాలు అధిక ధరలకు విక్రయించడం వారిని దోచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తుందనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.
 
8 గంటలకు దుకాణాలు మూసివేస్తుండగా అదే సమయానికి ట్రాఫిక్‌, పోలీసు సిబ్బంది డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టడం ప్రభుత్వ నిబంధన సాకుతో మందుబాబుల జేబులు కత్తిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాలు తొందరగా మూసివేయడం, అధిక ధరలు వసూలు చేయడం ప్రైవేటు బార్‌ నిర్వాహకులకు కలిసివచ్చింది. కొన్నిచోట్ల బార్‌ యజమానులు అధిక ధరకు మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. కొన్ని బార్ల గతంలో విక్రయ దుకాణం అనుసంధానంగా ఉండేది. ప్రస్తుతం విక్రయ దుకాణానికి ఐరెన్‌ గ్రిల్స్‌ ఏర్పాటుచేసి నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగించడం బహిరంగ రహస్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: