భారతీయ జనతా పార్టీ పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడున్న పార్టీ ఆనాటి బీజేపీ పార్టీ  కాదన్నది వాస్తవం అని ఇప్పుడు కేద్రంలోని పెద్దలు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు కేంద్ర పాలనలోనూ, పార్టీలోనూ తీసుకుంటున్న నిర్ణయాలు బొత్తిగా కాషాయం పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల క్రేజ్ నడుస్తుండటంతో వారి నిర్ణయాలకు తిరుగులేకుండా పోయింది. అందుకే అభ్యర్థుల ఎంపికలో మోడీ, షాలు ఎన్ని విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నా వారికి అడ్డుచెప్పే వారు కూడా పూర్తిగా లేకుండా పోయారని బాధపడుతున్నారు.


ఇకపోతే గతంలో బీజేపీ పార్టీ సిద్ధాంతాలను తెలిసిన వారిని, సంఘ్ పరివార్ లో పనిచేసి, పార్టీ కోసం కష్టపడిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసేవారు. కాని వారి గెలుపోటములు చూసేవారు కాదు. ఇలా అద్వానీ, వాజ్‌పేయి హయాం వరకూ నడిచింది. అప్పుడూ పార్టీ రాష్ట్ర కార్యవర్గం మాత్రమే అభ్యర్థుల ఎంపికను ఎక్కువగా చేపట్టేది. కాని కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకునేది కాదు. కేవలం ఫలితాల తర్వాత మాత్రమే గెలుపోటములపై కేంద్ర నాయకత్వం విశ్లేషణలు చేసేది. కానీ మోదీ, షాల హయాంలో పరిస్థితి పూర్తిగా మారింది. రాష్ట్ర పార్టీ నాయకత్వం నామమాత్రంగా మారింది.


సర్వే నివేదికలు, స్టార్ డం ఉన్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఇకపోతే అమిత్ షా నేరుగా అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలు కొంత మేర తీసుకున్నప్పటికీ ఎక్కువగా ప్రజాదరణ ఉన్న వారికే టిక్కెట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈ తంతూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ లోక్ సభ ఎన్నికల్లో కూడా జరిగింది. ఇక తాజాగా హర్యానా  రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూడా ఇదే తంతు మొదలయింది.


ఇక్కడ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి. రెజ్లర్ యోగీశ్వర్ దత్, బబితా ఫొగట్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ లాంటి వారికి  టిక్కెట్లు కేటాయించారు. వీరితో పాటు హర్యానాలో టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సొనాలికి కూడా టిక్కెట్ దక్కిందంటే బీజేపీ కేంద్ర నాయకత్వం ఏ రూట్లో వెళుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వీరి వాలకం చూసి చూసి విసిగిపోయిన టిక్కెట్లు దక్కని బీజేపీ నేతలు కొందరు రెబెల్స్ గా మారి, మోడీ, షాలు కలసి కాషాయ పార్టీ రంగును తప్ప రుచి, వాసనలన్నీ మార్చేస్తున్నారని వాపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: