60 వేల కోట్లు అప్పుల్లో ఉన్న ఎయిరిండియా కేవలం 500 కోట్లు కట్టలేక మరో వరం రోజుల్లో ఆగిపోనుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే .. ఈ నెల 18 నుంచి అంటే మరో వారం రోజుల తరువాత ఎయిరిండియా సేవలు నిలిచిపోనున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ రంగా ఎయిరిండియాకు 18వ తేదీ నుంచి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ను (ఏటీఎఫ్) సరఫరా చేయబోమని చమురు రంగ కంపెనీలు తేల్చి చెప్పాయి.

     

ఇప్పటి వరుకు బకాయిలు చెల్లించే వరకూ ఏఐకి ఇంధనాన్ని అందించామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలు చెప్పేశాయి. గడచిన 8 నెలలు నుంచి ఈ కంపెనీలకు ఏఐ ఇంధనానికి డబ్బులు కట్టలేదు. దీంతో రూ. 5 వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. 

       

అయితే గత ఆగస్టు నెలలోని ఇదే విధంగా నిర్ణయం చమురు కంపెనీలో తీసుకోగా, కేంద్ర పౌర విమానయాన శాఖ కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దింది. అయితే అప్పటికి బకాయిలు చెల్లించకపోవడంతో చమురు కంపెనీలు ఇప్పుడు అల్టిమేటం ఇచ్చాయి. కాగా ప్రస్తుతం ఎయిరిండియా 60 వేల కోట్ల అప్పుల్లో ఉంది. కాగా ఏటీఎఫ్ సరఫరాను నిలిపివేస్తే, ఏఐ విమానాల సేవలు నిలిచిపోవడం ఖాయమని తెలుస్తుంది.         

       

ఒకవేళ అదే జరిగితే, భారత ఏవియేషన్ ఇండస్ట్రీలో సంక్షోభం మొదలైనట్టేనని, ప్రయాణికుల అవసరాలను, డిమాండ్ కు తగ్గట్టు సర్వీసులను నడిపించడంలో ప్రైవేట్ సంస్థలు విఫలం అవుతాయని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎయిరిండియా సేవలు నిలిచిపోతాయి ? లేదా అనేది ఈ నెల 18 తర్వాత తెలుస్తుంది.  

     

మరింత సమాచారం తెలుసుకోండి: