ఆస్తి కోసం సొంత వారినే దారుణంగా హతమారుస్తున్న రోజులువి..మంచి చెడూ అనే ఆలోచన లేకుండా ఉన్మాదుల్లా మారుతూ..డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా దోమకొండలో దారుణం జరిగింది. మల్లయ్య దేవాలయం దగ్గర ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య. మృతులు బిక్కనూరు మండలం జంగంపల్లి కి చెందినవారిగా గుర్తింపు.
చందన, బాలయ్య,లతను అతని తమ్ముడే గొంతు కోసం హత్యచేశాడని అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురు ఆపస్మారక స్థితిలో ఉండగా గ్రామస్థులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం పంపారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతులు జంగంపల్లి కి చెందినవారిగా గుర్తించారు. అయితే ఈ హత్య బాలయ్య తమ్ముడు
రవి ఈ ముగ్గురుని హత్య చేసినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో
రవి ఉన్నాడు. అయితే ఈ హత్యలకు కారణం ఆస్తి తగాదాలు లేదా కుటుంబ కలహాలు గాని అయి ఉండవొచ్చని వారు భావిస్తున్నారు. ఈ మూడు హత్యలపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పారు.