ఏపీ ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డిని
చిరంజీవి అతని భార్య సురేఖ ఈరోజు కలిశారు. సీఎం జగన్, అతని భార్య భారతి
చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. తాడేపల్లిలోని
జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. చిరంజీవి సీఎం జగన్ నివాసానికి చేరుకోగానే సీఎం జగన్ ను షాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు.
అయితే దాదాపు గంట పాటు సీఎం జగన్ తో
చిరంజీవి మాట్లాడారు. మెగాస్టార్
చిరంజీవి నటించిన
సైరా నరసింహ రెడ్డి సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను సీఎం జగన్ చూడలని అందుకే వ్యక్తిగతంగా
చిరంజీవి సీఎం జగన్ ని ఆహ్వానించరు.
మెగాస్టార్ చిరంజీవి, జగన్ సమావేశంపై రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడిచాయి. అయితే ఈ సమావేశంపై సీఎం జగన్ ఫేసుబుక్ ద్వారా స్పందించారు. చిరంజీవితో గడిపిన మధుర క్షణాల గురించి సీఎం జగన్ ఆ ఫేసుబుక్ లో షేర్ చేశారు. ‘సైరా నరసింహారెడ్డి’ని కలుసుకోవడం చాల సంతోషంగా ఉందని సీఎం జగన్ తెలిపారు. చిరంజీవి ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలను తమకు ఇస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.' సీఎం జగన్ ఫేసుబుక్ లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.