వైసీపీ సర్కార్లో కొద్ది మంత్రి మంత్రులు మరీ చురుకు. వారు మాట్లాడితే చాలు అధికార పార్టీలోనూ అలజడి రేగుతుంది. గట్టిగా మాట్లాడే వారే కాదు, ఫైర్ బ్రాండ్ కూడా. వారిని టచ్ చేయడానికి సొంత పార్టీల వారే కాస్త ఆలోచిస్తారు. అయితే సర్కార్ అన్నాక ఉండాలి మరి. నోటి బలం ఉన్న మంత్రులు కొందరు ఉన్నా చాలు విపక్షాన్ని కట్టడి చేయడానికి. చెలరేగిపోవడానికి.
ఇక ఏపీ జలవనరుల మంత్రి
అనిల్ కుమార్ యాదవ్
జగన్ కి ఇష్టమైన మంత్రి. ఆయన దూకుడు చూసే
జగన్ రాజకీయంగా అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఇపుడు ఏకంగా మంత్రిని కూడా చేశారు.
అనిల్ కుమార్ అసెంబ్లీలో ఉంటే చాలు విపక్షం మంచినీళ్ళు తాగాల్సిందే. ఆ మధ్యన శాసన మండలికి వెళ్ళిన
అనిల్ కుమార్ అక్కడ
లోకేష్ కి చుక్కలు చూపించేశారు. గూగుల్ లో పప్పు అని కొడితే
లోకేష్ బొమ్మ వస్తుందని చెప్పి సభలో మంటలు పుట్టించారు.
ఇదిలా ఉండగా
అనిల్ కుమార్ ఈ రోజు నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్
జగన్ ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో ఇచ్చిన స్పీచ్ హైలెట్ అంటున్నారంతా. జగనన్న నాకు ఎన్నో ఇచ్చారు. రాజకీయంగా గౌరవించి మంత్రిని చేశారు. స్వాతంత్రం వచ్చాక నెల్లూరులో ఓ బీసీని మంత్రిని చేసిన ఘనత
జగన్ దేనని ఆవేశంగా చెప్పారు. తనకు ఈ రాజకీయ పదవులు చాలు అంటూ తాను జగన్ కి ఈ జన్మంతా సైనికుడిగా ఉంటానని సభాముఖంగా చెప్పారు.
అంతటితో ఆగని ఈ మంత్రి గారు ఎంతమంది గింజుకున్నా ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా ఏపీకి
జగన్ మరో పాతికేళ్ళ పాటు సీఎంగా ఉంటారు. ఇది చరిత్ర అంతే. దీని ఎవరూ చెరిపేయలేరు అని మంత్రి అన్న మాటలు సభలో కేకలు పుట్టించాయి. మాట మీద నిలబడిన మనిషి ఒక్క
జగన్ మాత్రమేనని, ఆయన నాలుగు నెలల పాలన స్వర్ణ యుగమని కూడా
అనిల్ అన్నారు. మొత్తానికి విపక్షాలకు
అనిల్ పూర్తి నిరాశ కలిగించేలా ఏపీలో సీఎం కుర్చీ మరో పాతికేళ్ళ వరకూ ఖాళీగా లేదని పక్కా క్లారిటీగా చెప్పేశారన్న మాట.