ఈ అధ్యయనం నెలో, రెండు నెలల్లోనో జరిగినది కాదు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లోని ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ (ERCC) చీఫ్ ప్రొఫెసర్ ప్రదీప్ తన విద్యార్థులను ఈ రీసెర్చ్లో భాగం చేశారు. విద్యార్థులు మూడేళ్లపాటూ శ్రమించి రిపోర్ట్ సిద్ధం చేశారు. ఆ రిపోర్ట్ని ఐఐటీ ప్రొఫెసర్లు, కేంద్రం మళ్లీ చెక్ చేశాయి.
దేశంలోని 50 నగరాల్లో భూకంప ప్రభావం ఉండగా... వాటిలో 13 నగరాల్లో తీవ్రమైన భూకంపాలు రానున్నాయి. 30 నగరాల్లో రిక్టర్ స్కేలుపై 4 నుంచీ 6 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక... 7 నగరాల్లో అంతంతమాత్రంగా భూకంపాలు రానున్నాయి. ఐతే... అధిక భూకంపాలు వస్తాయని చెప్పిన నగరాల్లో విజయవాడ కూడా ఉంది. దాంతోపాటూ... ఢిల్లీ, కోల్కతా, పుణె, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, సిలిగురి, డార్జిలింగ్, ఛండీగఢ్ వంటి నగరాలు ఉన్నాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లలో ఉన్నప్పుడు ఎదైనా కదలిక వస్తే... వెంటనే ఇళ్లలోంచీ బయటకు వచ్చేయాలని చెబుతున్నారు.