ఇప్పుడు తెలంగాణ లోని ప్రధాన సమస్య ఆర్టీసీ సమ్మె. ఎందరో ఆర్టీసీ సిబ్బంది ఎంతో పోరాడిన ప్రభుత్వం వైఖరి మాత్రం అస్సలు మార్చుకోవట్లేదు. ఈ నేపథ్యంలో భాగంగా తెలంగాణ గవర్నర్ 'తమిళిసై సౌందర్ రాజన్‌'కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఈ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో ఈమె భేటీ కానున్నారు. తర్వాత హోం మంత్రి అమిత్ షాతో సమావేశం ఏర్పాటు కానున్నది. గవర్నర్ పర్యటన భాగంగా ఢిల్లీలో తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆర్టీసీ సమ్మె గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని కారణంగా కేంద్ర గవర్నర్‌ను నివేదిక కోరినట్టు తెలుస్తోంది. అనేక విషయాలు చర్చకు రానున్నప్పటికీ.. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరే చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణ సర్కారు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం.. పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేలా.. పోలీసుల సెలవులు రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బస్‌ డిపో, బస్టాండులతో బాటు అన్ని ప్రధాన ప్రాంతాల్లో పోలీస్‌ బలగాలు మోహరించి ఉన్నాయి. అక్టోబర్ 19న తెలంగాణ బంద్‌ నేపథ్యంలో సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టులో పిటీషన్ నమోదైంది. ఈ పిటీషన్‌‌పై ఇప్పటికే రెండుమార్లు విచారణ జరపగా.. మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. 

మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమంతట తామే ఉద్యోగాలను పోగొట్టుకున్నారన్న సీఎం కేసీఆర్ సమ్మె విషయంలో కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తాను సిద్ధమని సీనియర్ నేత కేశవ రావు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ కూడా కేశవ రావు మధ్యవర్తిత్వాన్ని ఆహ్వానించింది. ఏది ఏమైనప్పటికీని తెలంగాణా ఆర్టీసీ వారికి విషయంలో గవర్నర్ రావడం ఒక ప్రత్యేకత మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: