ఛీఛీ.. మనిషి కాదు.. మనిషి జన్మ ఎత్తిన క్రూరమృగం. ఆల్రెడీ రెడ్ లైట్ ఏరియాలో విచ్చల విడిగా తిరిగి ఎయిడ్స్ వ్యాధి తెచ్చుకున్నాడు. కానీ కొంచం కూడా సిగ్గు లేదు ఆ నీచుడికి. చిన్న పాప అని కూడా చూడకుండా ఎయిడ్స్ వ్యాధి పెట్టుకొని ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. 


ఇది ఎక్కడో జరగలేదు.. తెలంగాణలోనే ఈ దారుణం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో ఏడేళ్ల చిన్నారిపై ఎయిడ్స్ వ్యాధి ఉన్న పక్కింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం ఈ నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 


అశ్వారావుపేటలో ఓ ఒంటరి మహిళ ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. వారింటికి సమీపంలోనే ఉండే 23 ఏళ్ల యువకుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు అతనికి ఎయిడ్స్ వ్యాధి ఉంది. ఆ యువకుడు అప్పుడప్పుడు బాధితురాలి ఇంటికి టీవీ చూసేందుకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలోనే పాపకు జ్వరం రావడంతో మందులు వేసి ఇంట్లోనే నిద్రపుచ్చింది. 


అనంతరం తల్లి జీవనోపాది నిమిత్తం కూలికి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన ఆ ఎయిడ్స్ రోగి ఒంటరిగా ఉన్న ఆ ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అయితే అదే సమయానికి తల్లి ఇంటికి రావడంతో ఆ ఘటనను చూసి తల్లి పెద్ద పెద్ద కేకలు వేసింది. దీంతో ఆ యువకుడు అక్కడి నుండి పరారయ్యాడు.  


దీంతో పోలీసులకు సమాచారం అందివ్వగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం చిన్నారిపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్దారించారు. యువకుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా తెలంగాణాలో ఇలాంటి ఘటనలు రోజుకు ఒకటి అయినా జరుగుతున్నాయి. తెలంగాణాలో ఆడపిల్లలకే కాదు ఆవుదూడలకు కూడా రక్షణ లేదు. కారణం ఈ మధ్య ఓ కామాందుడు ఆవు దూడపై అత్యాచారం చేశాడు నీచుడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: