జమ్మూ కశ్మీర్లో మరోసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను సైన్యం హతమయ్యారు. అనంత్నాగ్ జిల్లా బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారు అని సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా బుధవారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. ఇదే సమయంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడగా... దానిని చుట్టిముట్టిన సైన్యం ముగ్గురు ముష్కరుల్ని హత మార్చిడం జరిగింది.
భీకర కాల్పులు కొనసాగిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేశారు. మొబైల్ సేవలపై ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతుండటంతో వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవ కూడా నిలిపివేయడం జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ సైనికుడు సైతం గాయపడినట్టు సమాచారం ఉంది. అలాగే, పజాల్పొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా దళాలు స్థానికులను హెచ్చరించడం జరిగింది. ఈ ప్రాంతంలోనూ సైన్యం తనిఖీలు చేపట్టారు.
మరోవైపు, గాందర్బల్ అడవుల్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేయడం కూడా జరిగింది. వారం రోజులుగా వీరి కోసం గాలిస్తుండగా, మంగళవారం దొరికారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ మరోసారి ఉల్లంఘించి ఉరి సెక్టారులో ఓ సైనికుడు, షాపుర్ సెక్టార్లో షమీమా అక్తర్(24) అనే మహిళను హతం చేశారు.
ఉగ్రవాదుల చొరబాట్లను నిరోధించేందుకు నౌగామ్ సెక్టార్లో పహారా కాస్తుండగా మందుపాతర పేలి ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరొకరు కూడా తీవ్రంగా గాయపడం జరిగింది. కాగా, సోమవారం పోస్ట్-పెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించగా, మంగళవారం జరిగిన సంఘటనలతో మళ్లీ నిలిపేయడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు భారీగా ర్యాలీ కూడా నిర్వహించారు.