ఇప్పటికి ఆంధ్ర ప్రదేశ్లో  ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా వంద రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ.. విపక్ష నేత చంద్రబాబు ఇరిటేట్ అవుతున్న తీరు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి.నిజానికి  కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడాది వరకూ ఎవరు ఏమీ మాట్లాడకుండా.. జరుగుతున్న పరిణామాల్ని చూస్తుండి పోతుంటారు. మరీ ఏదైనా.. ముఖ్యమైన ఘటన  జరిగితే.. తమ వాదనను వినిపిస్తారు తప్ప.. ఎక్కువగా జోక్యం చేసుకోరు. దీనికి కారణం లేకపోలేదు. ప్రజలు నచ్చి.. మెచ్చి పవర్ చేతికి వచ్చినప్పుడు.. వారి అభిప్రాయాల్ని గౌరవించాలన్న భావనతో  వ్యవహరిస్తుంటారు.


దీనికి వేతిరేకంగా బాబు పరిస్థితి ఉందని చెప్పాలి. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా వంద రోజులు కూడా కాలేదు. బాబు అదే పనిగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వెళ్లటం.. అవసరం ఉన్నా లేకున్నా.. డైలీ బేసిస్ లో ఏదో ఒక అంశం మీద ఆగ్రహం వ్యక్తం చేయటం జరుగుతుంది.. ప్రభుత్వాన్ని తిట్టేందుకు కొత్త కొత్త తిట్లను కూడా ప్రయోగిస్తున్నారు.


అంతే కాకుండా.. ఈ మధ్యన కాకినాడకు వెళ్లిన ఆయన.. అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకూ పార్టీ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారంటే నమ్మండి. విపక్షంలో ఉన్నప్పుడు.. ఎన్నికలు గట్రా లాంటివి లేని వేళలో.. పార్టీ నేతల్ని ఇలా చిరాకు పుట్టించటం ఏమిటన్న విమర్శ వినిపించింది కదా.


తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ  చూడలేదు అని ఆయన.. తాను అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మాదిరి వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవారంటూ వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. అధికారం చేతిలో లేనప్పుడు ఇరిటేషన్ మామూలే. కానీ.. ఆ పేరుతో నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న విషయాన్ని బాబు  మర్చిపోకూడదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: