పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీని బలోపేతం చేయాలనేది భాజాపా టార్గెట్. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ తన పూర్తి ఫోకస్ ను బెంగాల్ పైనే కేంద్రీకరించనుంది. త్వరలోనే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ సానుకూల ఫలితాలనే పొందనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగానే ఏర్పాట్లను చేసుకుంది. ఎన్నికల విషయంలో.. అక్కడ రాజకీయం కోసం బీజేపీ చాలా పన్నాగాలనే రెడీ చేయనుంది. అందులో భాగంగా ఈ సారి బీజేపీ దృష్టి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పై పడింది. అతనికి బీజేపీ ప్రాధాన్యతను ఇస్తోందని., గంగూలీని ఏకంగ్రీవంగా బీసీసీఐ ప్రెసిడెంట్ గా చేసేందుకు బీజేపీ సహకారం అందించిందని ఓ  ప్రచారం జరుగుతోంది. 

ఈ మధ్య అమిత్ షా - గంగూలీ ల సమావేశంపై కొన్ని వార్తలు చెక్కర్లు కొడ్తున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆయన మద్దతు పలికేలా అమిత్ షా ఒప్పించారని అందుకే ఆయనకు బీసీసీఐ పగ్గాలను అప్పగిస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. అమిత్ షా - గంగూలీల మధ్య ఆ డీల్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పూర్తిగా స్పందించేశాడు గంగూలీ. 

నిర్మొహమాటంగా మాట్లాడే సౌరవ్.. తను బీజేపీతో ఎలాంటి రాజకీయ ఒప్పందాన్నీ చేసుకోలేదన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు పలికే ప్రసక్తి లేదన్నాడు. అమిత్ షాతో సమావేశంలో అలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కుండబద్ధలు కొట్టాడు. అంతే  కాదు… తను బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నందుకు తనను అభినందించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా దాదా కృతజ్ఞతలు  తెలిపాడు. అలా మమతా దీదీతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయనే సంకేతాలను ఇచ్చాడు  సౌరవ్ దాదా! 

ఎంతైనా గంగూలీ ఎంత గొప్ప ఆటగాడో మనకి తెలిసిందే., అతని టాలెంట్ కు సీనియారిటీ కి ఎటువంటి రికమండేషన్ అక్కర్లేదని అభిమానుల అభిప్రాయం...

 

మరింత సమాచారం తెలుసుకోండి: