ఏపీలో జగన్ పాలనను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇక అధికారంలో కొన్నాళ్ళు ఉండి ఇపుడు ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన పెద్ద తలకాయలు ఉన్నాయి. వారిని పని లేదు. మీడియా దొరికితే చాలు కామెంట్స్ చేస్తూ సంచలనాలు నమోదు చేసే వారు ఎక్కువగా ఉన్నారు. ఏపీకి నిధులు లేవు, విభజన గాయాలు మానలేదు, కేంద్రం సాయం లేదు, ప్రత్యేక హోదా అంతకంటే లేదు.


ఇవన్నీ వదిలేసి జగన్ మీద పడుతున్న నాయకులను ఏమనాలో అర్ధం కాని పరిస్థితి. ఇంతలా అనైక్యత ఉండబట్టే  ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి కూడా ఏపీ లోకువ అయిపొయిందని అంటున్నారు. విషయానికి వస్తే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ జగన్ మీద గట్టిగానే సెటైర్లు వేశారు. జగన్ కి అనుభవం లేదని, పైగా చెప్పేవారు ఎవరూ పక్కన లేరని జేసీ అన్నారు.


అంతటితో ఆగకుండా జగన్ ఎవరు చెప్పినా వినే రకం కాదని కూడా తేల్చేశారు. జగన్ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనుకుంటారని అందువల్ల ఆయన టైప్ లో పాలన చేస్తున్నారని పంచులేశారు. జగన్ పాలనలో మంచి చెడ్డా చెప్పమంటే ఇపుడే ఏం చెబుతామని కూడా జేసీ వెటకారమాడారు.


సంక్షేమ పధకాల గురించి తనకు తెలియదని ప్రజలే  చెప్పాలని కూడా ఆయన అనడం విశేషం. ఇక జగన్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది నరేంద్రమోడీ అని ఆయన మంత్రదండం ముందు మరే దండమూ పనిచేయదని కూడా జేసే సెటైర్లు వేశారు. మరో ఏడాది ఆగితే జగన్ పాలన ఏంటన్నది పిక్చర్ పూర్తిగా వస్తుందంటూ విసుర్లు విసిరారు. మొత్తానికి ఈ పెద్దాయన ఏమీ చెప్పనంటూనే అన్నీ చెప్పేసినట్లుగా లేదూ. దటీజ్ జేసీ..



మరింత సమాచారం తెలుసుకోండి:

jc