బుద్ధా వెంకన్న ఏమైంది నీ బుద్ధికి ? సీఎం 'జగన్'తో పరీక్షా ఏంటి ? అంటూ బుద్ధా వెంకన్నను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అప్పట్లో ఒకే పార్టీలో ఉన్న ఎంపీ కేశినేని నానితో ట్విట్టర్ వార్ చేసిన బుద్ధా వెంకన్న అనంతరం విజయ సాయి రెడ్డితో ట్విట్ వార్ చెయ్యాలనుకున్నాడు. కానీ ఎం లాభం.. విజయసాయి రెడ్డిని విమర్శిస్తూ ఎన్ని ట్విట్లు పెట్టిన విజయసాయి రెడ్డి పట్టించుకోవడం లేదు. 


ఇంకా విషయానికి వస్తే .. ప్రతిపక్ష నాయకుల మాటలను ఎప్పుడు తిప్పి కొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు లోకేష్ పై ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'గ్రామ కార్యకర్తలుగా ఎంపికైన వారిలో ఎవరికీ ఓనమాలు రావట చంద్రబాబు గారి కడుపు మంట మాటలు. అందరూ తన కొడుకు నారా లోకేష్ లాగా మొద్దబ్బాయిలనుకుంటున్నాడు. లోకేశ్ తో పరీక్ష రాయించండి కనీసం పది మార్కులు కూడా తెచ్చుకోలేరని ఉద్యోగాలు సాధించిన యువత ఇప్పటికే సవాలు చేశారు'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.   


అయితే ఈ వ్యాఖ్యలకు బుద్ధ వెంకన్న పరోక్షంగా స్పందించాడు. వెంకన్న ట్విట్ చేస్తూ ''శకుని మామా లీకు వీరుడిని పట్టుకొని గ్రీకు వీరుడు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నీకు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు లీక్ చేసిన పేపర్ నాకు కూడా పంపండి. నేను, మీ తుగ్లక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరీక్ష రాస్తాం. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకుందాం. సవాల్ కి సిద్ధమా శకుని మామా?'' అంటూ ట్విట్ చేశాడు బుద్ధా వెంకన్న. 


అయితే ఈ ట్విట్లకు స్పందించిన నెటిజన్లు.. ''బుద్ధా వెంకన్న ఏమైంది నీ బుద్ధికి ? సీఎం 'జగన్'తో పరీక్షా ఏంటి ?'' పేపర్ లీక్ చేస్తే పరీక్షా రాయడం ఏంటి ? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు స్పందిస్తూ '' ఏంటి బాబు వెంకన్న నీకు చదువు వచ్చా'' అప్పుడెప్పుడో నీకు ఆ ఆ లు కూడా రావు అన్నట్టు విన్నాము అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: