వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విశాఖ భూ కుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీమంత్రి చంద్రబాబు నాయుడు, అతని సుపుత్రుడు
నారా లోకేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని అమర్నాధ్ వ్యాఖ్యానించారు.
విశాఖ భూ కుంభ కోణంలో ప్రధాన పాత్రధారి చంద్రబాబు, లోకేష్ అని అమర్నాధ్ ఆరోపించారు.
నారా లోకేష్ మాట్లాడటం రాదు కానీ మాటలు సర్దిచెప్పడం మాత్రం బాగా వచ్చని అమర్నాథ్ పేర్కొన్నారు. అయితే గతంలోనే ప్రతి పక్ష హోదాలో ఉన్న సమయంలోనే సిట్ నివేదిక బయట పెట్టాలని అప్పటి ప్రభుత్వన్నీ ప్రశ్నించి డిమాండ్ చేసినప్పటికీ వారు స్పందించలేదని అమర్నాథ్ గుర్తు చేశారు.
కాగా ఈ విశాఖ కుంభకోణంలో వైసీపీ నేతల పాత్ర ఉన్నట్టు కొందరు అసత్య ప్రచారం చేశారని, నిజంగా అందులో ఎవరిదైనా పాత్ర ఉంటె కఠిన చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే అమర్నాథ్ గట్టిగా చెప్పారు. కాగా విశాఖ ప్రజలను జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు చెయ్యాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చాడు. విశాఖ భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్
జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని అమర్నాథ్ పేర్కొన్నారు.
ఆ మాట కోసమే ఇప్పుడు సిట్ నియమించారని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భూ దోపిడిపై విచారణకు సిట్ నియమించారని అమర్నాథ్ చెప్పుకొచ్చారు. మరి అమర్నాథ్ తెలుగుదేశం పార్టీ అధినేతలపై చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.