మనందరం ఈ ఆధునిక శకంలో కృత్రిమ మేధస్సు, ఆటోమేటిక్ డ్రైవింగ్ కార్లు, బిట్ కాయిన్లు అంటూ తిరుగుతుంటే మరోవైపు కొన్నిచోట్ల ఇప్పటికి మూఢనమ్మకాలను నమ్ముతూ దెయ్యాలు పట్టాయని చేతబడులల పేరుతో ఘోరాలకు పాల్పడుతున్నారు. ఇంకా దురదృష్టకరం ఏమిటంటే మన సొంత ఇంటిలో వారే ఇటువంటి అమానుష ఘటనలలో మోసగాళ్లకు తోడ్పడటం.

విషయం ఏమిటంటే హైదరాబాదులో ఒక మహిళను ఆమెకు దెయ్యం పట్టిందని ముగ్గురు మంత్రగాళ్లు ఆమెను చేతబడి పేరుతో రేప్ చేశారు. అంతకన్నా ఘోరం ఏమిటంటే తన సొంత భర్తే ఆమెను వారి దగ్గరికి పంపించి మొత్తం రికార్డు చేసి తర్వాత బ్లాక్ మైల్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. ముందుగా అత్తమామలు ఆమెకు దయ్యం పట్టిందని నింద వేసి తర్వాత ఈ నీచమైన పనికి వారి కొడుకును ప్రేరేపించారు. గత సంవత్సరం డిసెంబర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన బాధితురాలు పోలీసుల్ని దగ్గరకు వెళ్లి నిన్న కంప్లైంట్ ఇవ్వడంతో తెర మీదకు వచ్చింది.

ఆమె చెప్పినది ఏమిటంటే.. తనను అనుభవిస్తే తనకు పట్టిన దెయ్యం పోతుందని ముగ్గురు మంత్రగాళ్లు ఆమె భర్తకు మరియు అత్తమామలు చెప్పడంతో వారు ఆమెను వారి దగ్గరికి తీసుకెళ్లి జరిగినదంతా రికార్డు చేశారట. ఇది తప్పు నేను ఇందుకు ఇకమీదట ఒప్పుకోను అని ఆమె చెప్పడంతో వారు.... ఒప్పుకోకపోతే తమ దగ్గర ఉన్న వీడియోలను ఆన్లైన్లో పెడతామని బెదిరించారట. దాదాపు ఒక సంవత్సరం రోజుల నుంచి ఆమెను ఇలాగే బెదిరిస్తూ ఆ క్రూరులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపింది ఆ మహిళ. దీంతో పోలీసు వారు షేక్ మూసా బావాజీర్ అనే ఒక మంత్రగాడి తో సహా ఆమె భర్తను మరియు అత్తమామలను అరెస్టు చేసి వారిపై కేసు రిజిస్టర్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: