ప్రజాధనం వృథా పేరుతో కోర్టుకు వెళ్లకుండా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్ సొంత కేసులే కాబట్టి ఖర్చు కూడా తనే భరించాలని అయన అన్నారు. అవినీతి కేసుల్లో సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం మరింత పెరిగిందని యనమల విమర్శించారు. సహ నిందితులు, సాక్షులకు ఉన్నత పదవులు కట్టబెట్టడమే ప్రత్యక్ష సాక్ష్యమని యనమల విమర్శించారు. ఇలాంటి పదవులు కట్టబెట్టినపుడు ఎందుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారని అంటున్నారు. రాజకీయనేతలపైనే కాదు.. మీడియాపై కూడా జగన్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని యనమల ఆరోపించారు.
ప్రజాధనం వృథా పేరుతో కోర్టుకు వెళ్లకుండా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్ సొంత కేసులే కాబట్టి ఖర్చు కూడా తనే భరించాలని అయన అన్నారు. అవినీతి కేసుల్లో సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం మరింత పెరిగిందని యనమల విమర్శించారు. సహ నిందితులు, సాక్షులకు ఉన్నత పదవులు కట్టబెట్టడమే ప్రత్యక్ష సాక్ష్యమని యనమల విమర్శించారు. ఇలాంటి పదవులు కట్టబెట్టినపుడు ఎందుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారని అంటున్నారు. రాజకీయనేతలపైనే కాదు.. మీడియాపై కూడా జగన్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని యనమల ఆరోపించారు.