తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మకులు ఒక్కోచోట ఒక్కో విధంగా తమ నిరసనను తెలియచేస్తున్నారు. అయితే కామారెడ్డి జిల్లా, బాన్స్‌వాడ మండలానికి చెందిన ఆర్టీసీ కార్మికులు తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. గత 14 రోజులుగా అలుపెరుగని రీతిలో సమ్మె నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ..బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు దున్నపోతుకు వినతిపత్రాన్ని సమర్పించారు. 


బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 14వ రోజుకు చేరింది. సమ్మె శిబిరం వద్ద కార్మికులు కోలాటం ఆడి నిరసన  తెలిపారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి  కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల నాయమైన డిమాండ్లను పరిష్కారించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 14 రోజులు కావస్తున్న సీఎం  పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని.... అందుకే దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశామన్నారు.

ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా అలక్ష్యం చేస్తోందని, ఇప్పటికైనా స్పందించి కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఖలీల్, సుదీర్, సంగమేశ్వర్, హన్మండ్లు, రాజాసింగ్, అశ్వీన్, సోను, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ గిరిధర్, కో కన్వీనర్లు మల్లయ్య, బసంత్, శంకర్, లక్ష్మణ్, నాగరాజ్, జీఎస్‌. గౌడ్, యాదుల్లా, మూర్తి, కౌ సర్, సాయిలు, చంద్రకాంత్, ప్రశాంత్‌రెడ్డి, రా ధ, సవిత, విమల, లక్ష్మీ, శ్యామల ఉన్నారు.

శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ గిరిధర్‌ అన్నారు. శుక్రవారం బాన్సువాడలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  వ్యాపారస్తులకు బంద్‌కు సహకరించాలని విన్నవించారు. బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయని ఆయన అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: