జగన్ ఐడియా.. మళ్లీ సూపర్ హిట్ అయ్యింది. ప్రజాధనం ఆదా చేయడంలో జగన్ ప్రభుత్వం మరోసారి సక్సస్ అయ్యింది. కేంద్రం, విపక్షాలు వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా.. ప్రభుత్వంపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే జగన్ పోలవరం టెండర్లలోభారీగా ప్రజాధనం ఆదా చేశారు.


ఇప్పుడు మరోసారి జగన్ ఐడియా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా వెలిగొండ టన్నెల్ టూ టెండర్ల విషయంలోనూ ఇదే జరిగింది. ఈ టెండర్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా మరోసారి భారీగా ప్రజాధనం ఆదా అయ్యింది. ఈ టెండర్ ద్వారా 87 కోట్లు ఆదా అయ్యాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే దాదాపు 7 శాతం తక్కువకు కోట్ చేయడం ద్వారా మేఘా కంపెనీ ఈ టెండర్ ను దక్కించుకుంది.


ప్రభుత్వం బిడ్డింగ్ ధర కంటే 3 శాతం తక్కువకు ధరను నిర్ణయించింది. అయితే మేఘా కంపెనీ దానికంటే మరో 4 శాతం తక్కుపకు టెండర్ వేయడం ద్వారా మొత్తానికి అనుకున్నదాని కంటే 7 శాతం సొమ్ము ఆదా అయ్యింది. మొత్తం 571 కోట్ల రూపాయలకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. మేఘా సంస్థ 491 కోట్ల రూపాయలకే పనులు చేస్తానని బిడ్ దాఖలు చేయడం ద్వారా 491 కోట్లకే ఈ టెండర్ పనులు పూర్తికానున్నాయి.


ఈ వెలిగొండ టన్నెల్ టెండర్ల ద్వారా జగన్ ఐడియా సూపర్ అని మరోసారి రుజువైంది. జగన్ చేపట్టిన ఇలాంటి రివర్స్ టెండర్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. మొత్తానికి పెద్ద ఎత్తున ప్రజాధనం మిగలడం మాత్రం మెచ్చుకోవాల్సిన అంశం. ఇదే ధనాన్ని ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాలకు మరలించడం ద్వారా ఇంకొందరు సామాన్యులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: