రకుల్ ప్రీత్ సింగ్ పొడగరి, సొగసరి. ఈ అమ్మడుకు ఇటీవలే మూడు పదులు నిండాయి. టాలీవుడ్ కి ఒకనాడు స్టార్ హీరోయిన్ ఆమె. ఇపుడు అవకాశాలు లేకుండా మిగిలిన భామ కూడా ఆమె.  ఆమె లేటెస్ట్ గా చేసిన మూవీ మన్మధుడు 2 ఫట్ మంది. దాంతో రకుల్ కెరీర్ కూడా క్లోజ్ అయింది. తమిళ్ లో ఇపుడు భారతీయుడు మూవీ మాత్రమే ఆమె చేస్తోంది. చేతిలో సినిమాలు లేవు. దాంతో రకుల్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది.


నేను సినిమాలకు విరామం ప్రకటిస్తున్నాను అని చెన్నైలో మీడియాతో రకుల్ చెప్పింది. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి చేసిన మూవీస్ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. అందువల్లనే నేను కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటాను అంటోంది రకుల్. దీని బట్టి చూస్తే రకుల్ చాలా బాధపడుతున్నట్లుగా అర్ధమైపోతోంది.


బాధ నిజమే అయినా దాని వేనక సరైన విశ్లేషణ చేసినపుడు మాత్రం తప్పు రకుల్ ది అనిపించకమానదు. ఆమె ఓ చిన్న సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టింది. అనతికాలంలోనే టాప్ లెవెల్ హీరోలకు పెయిర్ గా నిలిచి హిట్లు కొట్టేసింది. ఆ టైంలో రకుల్ వేసిన కొన్ని రాంగ్ స్టెప్ ల  మూలంగానే ఆమె ఇపుడు ఫేడౌట్ అయిందని అంటున్నారు


నిజానికి రకుల్ లో అందం, అభినయం ఉన్నాయి. ఆమె కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉంటే ఇప్పటికీ టాప్ స్టార్ గా ఉండేదే. ఆమె కంటే బాగా ముందు వచ్చిన తమన్నా, అనుష్క వంటి వారు ఇంకా లైం లైట్లో ఉండగా లేనిది రకుల్ కి ఎందుకు సాధ్యం కాదు. మొత్తానికి రకుల్ సినిమాలకు కామా అంటోంది.


అయితే ఆది ఫుల్ స్టాపా కాదా అన్న‌ది ముందు ముందు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ మధ్యనే మూడవ పదిలో పడిన రకుల్ తన పుట్టిన రోజు పండుగను కేవలం పేరేంట్స్ తోనే జరుపుకుంది. ఆమె తొందరలో పెళ్ళి చేసుకుని సెటిల్ అవుతుందని రూమర్స్ కూడా వస్తున్నాయి. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: