ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఏ ధరతో ఉంటుందో చెప్పలేని రీతిలో పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తున్న బంగారం ఇప్పుడు తరచుగా అందుబాటులోకి వస్తుంది. ఇక బంగారం కనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గింపు వైపు పరుగులు తీస్తున్నాయి. వీటి ధరలు ఓ సారి పరిశీలిస్తే..


ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.35 శాతం తగ్గుదలతో రూ.38,062కు క్షీణించింది. గత నెలలో బంగారం ధర రూ.40,000 మార్క్‌కు చేరింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,950 తగ్గింది. అదే సమయంలో ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర కూడా తగ్గింది. వెండి ధర కేజీకి 0.7 శాతం తగ్గుదలతో రూ.45,228కి పడిపోయింది. ‘‘బంగారం ధర ఒక రేంజ్‌బౌండ్‌లో కదలాడవచ్చు. కొన్ని కీలక అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.


భౌగోళిక ఉద్రిక్తతలు, ప్రపంచ వృద్ధి ఆందోళనలు వంటి వాటి కోణంలో చూస్తే బంగారం ధర పైకి కదిలే అవకాశముంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది. ఇకపోతే ధంతేరాస్, దీపావళి నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరగొచ్చని జువెలర్లు విశ్వాసంతో ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో బంగారం ధరల తగ్గుదల కూడా డిమాండ్ పెరుగుదలకు దోహదపడొచ్చని అంచనా వేస్తున్నారు.


అలాగో గోల్డ్ బాండ్లలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. సబ్‌స్క్రిప్షన్ ఈ రోజు అంటే 21 నుంచి ప్రారంభమౌతుంది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇలానే కొనసాగుతున్నాయి. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్లు మందగించడంతో ఈ ధరలు కొనసాగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: