మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్ధానాలు, రెండు లోక్సభ స్ధానాల ఉప ఎన్నికలకు పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతోంది. కాగా, అక్టోబర్ 24న మహారాష్ట్ర, హరియాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.. ఇకపోతే ఈ ఎన్నికల్లో తమ ఓట్లను సినీ సెలబ్రేటిలే కాకుండా రాజకీయ వర్గాలవారు, వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కూడా సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నారు. వీరిలో సినీ ప్రముఖులు జెనీలియా, రితేష్ దేశ్ముఖ్, రవి కిషన్, కిరణ్రావ్, అమీర్ఖాన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇకపోతే దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన రెజ్లర్ బబితా ఫొగాట్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నవారిలో ఉన్నారు.. వీరే కాకుండా ఈ ఎన్నికల్లో బరోడా నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న, ఒలంపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే బారామతిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఆ అసెంబ్లీ స్థానంలో ఎన్సీపీ తరఫున అజిత్ పవార్ పోటీ చేస్తున్నారు. ఇకపోతే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్పూర్లోని మహాల్ పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ..
ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. వీరే కాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన సతీమణి అమృత, తల్లి సరిత నాగ్పూర్లోని పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ కూడా తన ఓటు హక్కును ఊపయోగించు కున్నారు.. ఇలా ఇంకెందరో ప్రముఖులు ఓటు వేయడానికి పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు.. ఇకపోతే ఈ రోజు ఉప ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఏవంటే యూపీలో 11, గుజరాత్ 6, బిహార్ 5, అస్సాం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడు 2, పంజాబ్ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్తాన్ 2, అరుణాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్గఢ్, పుదుచ్చేరి, మేఘాలయ, తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు.. మహారాష్ట్రలోని సతారా, బిహార్లోని సమస్తిపూర్ లోక్సభ స్థానాలకు అన్నీటికి కూడా ఈ రోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు..