విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో జగన్ పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజలకు పోలీసులు చేస్తున్న సేవలను జగన్ మెచ్చుకున్నారు. విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసులు అమరులయ్యారని గుర్తు చేశారు.


ఈ సందర్భంగా పోలీసులకు తన ప్రభుత్వం చేస్తున్న ఉపకారాలు గుర్తు చేశారు జగన్. పోలీసులు కూడా వారానికి ఒకరోజు కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలనే వీక్లీ ఆఫ్ ఇస్తున్నామని జగన్ ప్రకటించారు. దేశంలో ఇలా చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే కావచ్చని జగన్ కామెంట్ చేశారు.


పోలీసు అమరవీరుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు జగన్. పోలీసులు ప్రజల గౌరవం, మన్ననలు పొందేలా పని చేయాలని జగన్‌ ఆకాంక్షించారు. ఇదే సమయంలో జగన్ హోంగార్డులకు వరం ప్రకటించారు. ఇటీవలే హోంగార్డులకు రోజువారి వేతనాన్ని కొంత మేర పెంచారు. తాజాగా ఆయన హోంగార్డు కుటుంబాలకు మరో వరం ప్రకటించారు. అదేమిటంటే.. విధినిర్వహణలో హోంగార్డు మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.


ప్రతి ఏటా అక్టోబర్ 21 ను పోలీసు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను స్మరించుకుంటారు. ఈరోజుకు వారం ముందు నుంటే ఈ అమరవీరుల వారోత్సవా లు ప్రారంభమవుతాయి. ఈ వారం రోజులు పోలీసులు ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ఓపెన్ హౌజ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పోలీసు వీరుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఇటీవల జగన్ వివిధ వర్గాలకు చేతికి ఎముక లేకుంజా వరాలు ఇస్తున్నారు. ఇటీవలే హోంగార్డులకు రోజువారి వేతనాన్ని కొంత మేర పెంచారు. తాజాగా విధినిర్వహణలో హోంగార్డు మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: