మహారాష్ట్రలోని నందూర్బార్‌ జిల్లా మనిబేలిలో ఆ గ్రామానికి చెందిన గ్రామస్థులు అంతా సోమవారం నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్ళితే, మనిబేలి గ్రామంలో 135 మంది ఓటర్లు ఉన్నారు.అయితే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏ ఒక్కరు  కూడా ఓటు వేయటానికి రాలేదు.వీరు ఈ నాటి పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ముందుగానే ప్రకటన చేసారు.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడుస్తున్నా,వాళ్ళ గ్రామానికి ఇంకా కరెంట్, రోడ్డు సౌకర్యం లేకపోవటమే,పోలింగ్‌ బహిష్కరణకు ముఖ్య కారణం అని వాళ్ళు పేర్కొన్నారు.దేశంలో నూటికి నూరు శాతం విద్యుత్‌ సదుపాయాన్ని అందిస్తున్నామని,నరేంద్ర మోదీ ప్రభుత్వం  గొప్పగా  చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్ర విద్యుత్‌ బోర్డు దృష్టిలో వాళ్ళ గ్రామం ఉన్నప్పటికీ  విద్యుత్‌ సదుపాయం లేకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే..

ఇప్పటికి  రాజకీయ నాయకుల వెంట పడి తమకు కరెంట్‌ ఇవ్వాలి,రోడ్డు కావాలి అంటూ తిరిగే ఓపిక తమకు ఇక లేదని, ఓ ఆఖరి ప్రయత్నంగా అసెంబ్లీ పోలింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించామని నటర్వ్‌ భాయ్‌ టాడ్వీ అనే 60 ఏళ్ల వృద్ధుడు తెలిపారు.ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌  యోజన పేరు కింద రెండేళ్ల క్రితం తమ గ్రామానికి 8 కిలోమీటర్ల రోడ్డు మంజూరు అయ్యిందని,కానీ అది ఇప్పటికీ కాగితాల వరకే పరిమితం అయిందని సదరు గ్రామస్థులు తెలిపారు.

ఓ పక్క దట్టమయిన అడవి ప్రాంతం, మరో పక్క నర్మదా నది డ్యామ్‌ బ్యాక్‌ వాటర్‌ ఉన్న కారణంగా ఆ గ్రామాన్ని అధికారులు అంతగా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు.గిరిజనులు ఎక్కువగా ఉన్న నదూర్బార్‌ జిల్లాలో ఈ గ్రామం ఉండడం వారికీ ఓ శాపంగా మారింది అని,మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం  అయిన నెంబర్‌ వన్‌ పరిధిలోకి వచ్చే అక్కల్‌కువా తహిసిల్‌లో ఈ గ్రామం ఉంది అని వాళ్ళు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: