హిందుత్వ భావాలు కలిగి ఉండి,ఎప్పుడూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే, బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరొక్కసారి వార్తల్లోకి ఎక్కారు . భోపాల్ రైల్వే స్టేషన్ వద్ద అక్టోబర్ 21న,సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గాంధీని హత్య చేసిన గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా కీర్తించడం,దివంగత ఐపీఎస్ ఆఫీసర్ పై ఎన్నికల ముందు వివాదాస్ప వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన భోపాల్ బీజేపీ ఎంపీ తన నోటికి ఆ తర్వాత కూడా పదును చెబుతూనే వచ్చారు. అయితే కొన్ని రోజులుగా నోటికి తాళం వేసుకుని ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇప్పుడు మరోమారు వార్తల్లో నిలిచారు.
అయితే ఈ సమయంలో బీజేపీ నిర్వహిస్తున్న గాంధీ సంకల్పయాత్రలో మీరు ఎందుకు పాల్గొనడం లేదు అని మీడియా ఆమెను ప్రశ్నించగా...దానికి సాధ్వి ప్రజ్ఞాసింగ్ గాంధీ జాతిపిత కాదు,ఈ దేశం
కన్న గొప్ప బిడ్డ అని సమాధానం ఇచ్చారు.ఆయన ఈ దేశం కోసం ఎంతో శ్రమించారు, కష్టపడ్డారు. అందుకు మేం ప్రశంసిస్తాం. ఆయన అడుగు జాడల్లో నడవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం అని పేర్కొన్నారు.
గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు,మహాత్ముడనీ,జాతిపిత కంటే ఈ దేశానికీ ఒక్క గొప్ప బిడ్డ అని , ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో గాంధీని హత్యచేసిన గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణించారు. దీంతో ఆగ్రహించిన పార్టీ నాయకత్వం ఆ వ్యాఖ్యలపై వివరణనివ్వాలని ఆదేశించింది. అయితే ఈ వ్యాఖ్యల వల్ల ఆమెకు ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఎదురవలేదు.
భోపాల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై ఆమె భారీ మెజార్టీతో గెలిచారు.ఇంతకుమించి వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని,సూటిగా సమాధానమిచ్చారు. ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్పై సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.