అన్ని మాక్ తెలుసు.. మేము ఇంకా ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అనుకుంటారు.. అందుకే 18 ఏళ్ళు రాగానే అమ్మాయిలు కూడా తల్లిదండ్రులు మాట కూడా వినరు. ఇలానే ఓ 18 ఏళ్ళ యువతీ మేజర్ అని తల్లిదండ్రుల మాట వినకుండా ప్రేమించిన వాడితో ఇంటి నుండి పారిపోయింది. 


పోలీసులుకు కంప్లైంట్ చేస్తే నేను మేజర్ అని ఎదురించింది. దీంతో తల్లిదండ్రులు కూడా ఆమెని పట్టించుకోవడం మానేశారు. ఇంకా అప్పటి నుండి ఇంటికి రాకుండా బయట బయటే ఉండేది ఆ యువతీ. అయితే ఆ యువతీ ఈరోజు ఓ హోటల్ వెనకాల శవం అయ్యి కనిపించింది. 


కర్నాటకలోని హసన్ పట్టణంలోని బీఎమ్ రోడ్‌లో ఉన్న సరయు హోటల్‌ వెనుక 23 సంవత్సరాల వయసున్న యువతి మృతదేహం పడి ఉంది. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించగా ఆ యువతిని అరకలగుడుకు చెందిన భవిత‌గా పోలీసులు గుర్తించారు. ఈ అనుమానాస్పద మృతి కేసును విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 


18 సంవత్సరాల వయసులోనే ప్రేమ పేరుతో తల్లిదండ్రులతో గొడవ పడి ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, తిరిగి తీసుకొచ్చినప్పటికీ వారితో ఉండేందుకు నిరాకరించింది అని అప్పటి నుండి ఆమె తల్లిదండ్రులకు దూరంగా జీవనం సాగించిందని తెలిసింది. కాగా ఆమె పెద్దగా చదువుకోలేదని ముగ్గురు యువకులను ఒకేసారి ప్రేమించిందని దర్యాప్తులో తేలింది. 


కాగా గత 12 రోజులుగా ఆమె హోటల్‌లో ఉంటున్నట్టు తెలిసింది. అయితే ఆమె చనిపోయే ముందురోజు పునీత్ అనే యువకుడు ఆమె రూమ్ కి వెళ్లినట్టుగా పోలీసులు తేల్చారు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యా గురయ్యిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.. కాగా ఆమె చేతిపై పునీత్ అని టాటూ కూడా ఉంది. 


చూశారుగా.. ఇలాంటి ఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. కానీ యువతీ, యువకులు తెలుసుకోవడం లేదు. తేలి తెలియని వయసులు పెద్దలు చెప్పిన మాటలు వింటే జీవితాలు అందంగా ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకొని యువత నడుచుకుంటే ఇలాంటి ఘటనలు కొన్ని అయినా తగ్గుతాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: