హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి . హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో టిఆర్ఎస్ దే విజయమని ఆరా , చాణక్య సంస్థ లు ప్రకటించాయి . టిఆర్ఎస్ కు 50 . 48 శాతం, కాంగ్రెస్ కు 39 . 95 శాతం ఇతరులకు 09 . 57 శాతం విజయ అవకాశాలున్నాయని వెల్లడించింది . హుజూర్ నగర్ లోని అన్ని మండలాల్లో టిఆర్ఎస్ కే మొగ్గు ఉన్నట్లు తమ సర్వేలో తేలినట్లు ఆరా సంస్థ తెలిసింది. టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 15 వేల మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది .
ఇక మిషన్ చాణక్య సర్వే ప్రకారం టిఆర్ఎస్ 53 , కాంగ్రెస్ 41, బిజెపి 1 . 1 శాతం, విజయావకాశాలు ఉన్నాయని ప్రకటించింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు . టిఆర్ఎస్ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు , నాయకులకు అయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయం కోసం గత నెల రోజుల్లో కష్టపడిన కార్యకర్తలకు ట్విట్టర్ వేదిక గా కేటీఆర్ కృతఙ్ఞతలు చెప్పారు .
టీఆరెస్ వైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొగ్గు చూపిస్తున్నప్పటికీ , కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం తమ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు . హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు . పోలింగ్ ముగిసే సమయానికి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది.