ఈ మధ్య కాలంలో ఫుల్ గా మద్యం సేవించి రోడ్ల మీద పది అటు పోయే వాళ్లను ఇటు పోయే వాళ్లను తిట్టడం పరిపాటిగా మారింది. అది ఎలాగా అంటే మగవారే కాకుండా మేము ఎం తక్కువ అన్నట్లు ఆడవారు కూడా ఇలా మొదలు పెట్టేసారు. ఇక అసలు విషయానికి వస్తే పీకలదాక మద్యం సేవించిన ఒక యువతి నడిరోడ్డులో నానా హంగామా చేసింది. రోడ్ల మీద ఏమిటి ఈ పని అని ప్రశ్నించిన అక్కడున్న స్థానికుల మీద చిందులు కూడా వేసి అమ్మనా బూతులు తిట్టింది. 


ఆ యువతి హంగామా తట్టుకోని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని హెణ్ణూరులో ఆదివారం రాత్రి పీకలదాక మద్యం సేవించిన సదరు యువతి, కొందరు యువకులు రోడ్ల మీదకు వచ్చారు. ఆ బ్యాచ్ లోని ఒక యువతి రోడ్డు మీద నానా హంగామా చేసింది. అల్లరి, కేకలు ఎక్కువ కావడంతో స్థానికులు రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది. 


దీనితో స్థానికులు వెళ్లి మద్యం సేవించిన వారిని ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ బ్యాచ్ లోని ఒక యువతి స్థానికులను అమ్మనా బూతులు తిట్టి అసభ్యంగా తీరు వహించింది. దింతో అభ్యంతరం చెప్పిన స్థానికుల మీద ఆ యువతి చెయ్యి చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. వారిలో కొందరికి నిషా దిగిపోవడంతో యువతి స్నేహితులు స్థానికులు గుమికూడుతున్న విషయం గుర్తించారు. 


అక్కడున్న స్థానికులను బూతులు తిడుతున్న యువతికి ఆమె స్నేహితులు నచ్చచెప్పడానికి చాలానే ప్రయత్నించారు. అయితే అడ్డు వచ్చిన స్నేహితుల మీద కూడా ఆ యువతి దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. దీనితో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మద్యం మత్తులో నానా హంగామా చేస్తున్న ఆ యువతిని ఆమె స్నేహితులు అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లి పోయారు. మద్యం మత్తులో చిందులు వేసి బూతులు తిట్టిన యువతి ఉత్తర భారతదేశానికి చెందినదని స్థానికులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.  రోడ్డ మీద, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి నానా హంగామా చేసిన యువతి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: