మరణం ఎవరికైన ఒకటే. అది ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం. కొందరు బాధపడుతున్న సమయంలో మరణం దరికి చేరితే, మరికొందరు సంతోషంగా ఉన్న సమయంలో హఠాత్తుగా మృత్యువు తన ఓడిలోకి చేర్చుకుంటుంది. ఇక మరికొద్ది క్షణాల్లో తనబిడ్డను చేతిలోకి తీసుకుని మురిసిపోయే సమయంలో మరణం ఆమెను హత్తుకుని తనతో పాటు తీసుకెళ్లింది. జాలి లేని దేవుడు మనషులకు జాలి కలిగించేలా చేసిన సంఘటన ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. 


అంబులెన్స్‌ రావడానికి ఆలస్యమవడంతో మరాఠి నటి పూజా జంజర్‌ (25) మృత్యువాత పడ్డారు. ఆమెతోపాటు అప్పుడే పుట్టిన ఆమె బిడ్డ కూడా మరణించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సినీ నటి పూజకు ఇటీవలే వివాహం అయింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. ప్రసవ తేదీ దగ్గరపడటంతో పూజ కుటుంబ సభ్యులు ఆమెను గోరెగావ్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడంతో పాటుగా పూజకు తీవ్ర రక్తస్రావమైంది. దాంతో ఆమెను హింగోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే అప్పటికే అర్ధరాత్రి కావడంతో అంబులెన్స్‌ కోసం ప్రయత్నించిన కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది.


అంబులెన్సు ఎంతసేపటికి రాలేదు.. దాంతో సదుపాయాలు సరిగా లేని ఓ ప్రైవేటు అంబులెన్స్‌ని తీసుకువచ్చారు.. పూజను అందులో హింగోలి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూజ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పలు మరాఠీ సినిమాల్లో నటించిన పూజ.. గర్భవతి అయిన కారణంగా అప్పటి నుండి చిత్రాలకు దూరంగా ఉంటూ విరామం తీసుకున్నారు. ఇకపోతే పాపాపుట్టిన సమయాలను ఆ చిట్టిచేతులు పట్టుకుని గడపవలసిన టైంలో ఇలాంటి విషాదం జరగడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: