లోకేష్ ప్రయోజకుడు కాలేదని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కలత చెందుతున్నారని ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోటశ్రీకాంత్ రెడ్డి అన్నారు. దాని వల్లనే ఆయన చంద్రబాబు దిగజారి రాజకీయాలు చేస్తున్నారని విమర్సించారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..లోకేష్ ఓ చెల్లని చెక్కు లాంటోడని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖలే నిదర్శనమన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో తాము 300 కోట్ల రూపాయల చెక్ సిద్దం చేశామని లోకేష్ అంటున్నారు. నిజానికి ఆ చెక్ పై సంతకం లేకపోతే అది చెల్లదనే విషయం లోకేష్ తెలియనట్లుగా ఉందన్నారు. ఎలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని గడికోట హితవు చెప్పారు. నరేంద్రమోదిని, అమిత్ షాను వ్యక్తిగతంగా సైతం విమర్శలు చేసి నేడు తన బినామిలను బిజేపిలోకి పంపారు. రాష్ర్ట అభివృధ్ది అంశాలపై మాత్రమే  వైయస్ జగన్ అమిత్ షా, రవిశంకర ప్రసాద్ ఇతర కేంద్ర మంత్రులను అధికారాలున్నారని చెప్పారు.



 చంద్రబాబులా వ్యక్తిగత అంశాలపై కలవడం లేదన్నారు. పచ్చమీడియా వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనపై సైతం దుష్ప్రచారం చేస్తోందన్నారు. . చంద్రబాబు ఎన్నికలలో చెప్పిన అబద్దాలు నమ్మక చిత్తుచిత్తుగా ఓడించారనే విషయం గుర్తించాలి. ముఖ్యమంత్రి  వైయస్ జగన్ హుందాతనంతో రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలపై, రాష్ర్ట అభివృధ్దిపై చిత్తశుద్ది ఉంటే ప్రతిపక్షనేతగా సలహాలు ఇవ్వండి. చంద్రబాబు ఇకపై కూడా నీవు రాయలసీమ, పులివెందుల గుండాలు, రౌడీలు అని వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ మహిళలే నీకు వాతలు పెడతారు. పోలీసు అమరవీరుల దినోత్సవంనాడు చంద్రబాబు డిజిపి ఖబడ్దార్ అంటూ పోలీసు వ్యవస్దను కించపరిచేలా మాట్లాడారు.మరోవైపు  వైయస్ జగన్ చట్టం ఎవరి చుట్టం కాదు,నిష్ఫక్షపాతంగా పనిచేయాలని చెప్పారు.పోలీసులకు,హోంగార్డులకు భీమా సౌకర్యాన్ని పెంచారు.హోంగార్డులకు వేతనాలు పెంచారు.పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలవుతుంటే చంద్రబాబు జలసీ ఫీలవుతున్నారు. నవరత్నాలు అమలవుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు.




చంద్రబాబు దిగిపోయాక ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు లాంటి వారు రాజకీయంగా కనుమరుగైతే ప్రజలు నిజమైన దీపావళి చేసుకుంటారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక వరుణదేవుడు సైతం కరుణించి నేడు అన్నినదులలో నీటిని పారిస్తూ డ్యామ్ లను నింపుతున్నారు. చంద్రబాబు ప్రజలను ప్రాంతాలవారీగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు. దిగజారి మాట్లాడితే ప్రజలే బుద్ది చెప్తారు. ఇసుక కొరత లేకుండా చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయం. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్ట్ షాపులు పెట్టి ప్రజలను దోచుకున్నారు. తెలుగుదేశం హయాంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను,కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టారు. కాని  వైయస్ జగన్ మాత్రం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వేధించవద్దని చెప్పారు. బిజేపి నేతల అంతు చూస్తానని ఎన్నికల సమయంలో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. తాను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదంటూ చంద్రబాబు కాళ్లబేరాలాడుతున్నాడని గడికోట మండిపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: