మొత్తానికి  ఆర్టీసీ కార్మికల విషయంలో కేసీఆర్ ఎక్కడా తగ్గట్లేదు.  తాజాగా కార్మికుల సంఘాలతో చర్చించే  ప్రసక్తే లేదని  సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.  యూనియన్లు లేకుంటేనే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని, ఆర్టీసీ నష్టాలకు కారణం యూనియన్లేనని కేసీఆర్ ఫీల్ అవుతున్నాడట. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్మికులు తమ ఉద్యోగాలు ఇమ్మని అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని కేసీఆర్ అంటున్నారు. ఏమైనా ‘నాలుగు గోడల మధ్య కూర్చుని సీఎం కేసీఆర్‌,    48,500 మంది ఆర్టీసీ కార్మికులను సింగిల్  డైలాగ్ తో తొలగిస్తున్నట్లు ప్రకటించడం అనైతికం. అందుకే కేసీఆర్ పై అందరూ విరుచుకు పడుతున్నారు.  రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా? రాజరికమా?’అని ఆలోచించుకునే పరిస్థితి ఉంది.   ప్రజల ఆత్మగౌరవానికి, ఒక నియంతకు మధ్య జరుగుతున్న పోరాటమని అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.   కేసీఆర్‌ పదవీ కాలం ఇంకా మరో మూడేళ్లు ఉంది.  ఆ తర్వాత రాబోయేది బీజేపీ  ప్రభుత్వమేనని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి కేసీఆర్ ఇవ్వన్నీ గమనిస్తున్నారా ? ఒకపక్క  భారీ విజయంతో మోదీ - షా ద్వయం  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారికంలోకి రావాలని ఈ ద్వయం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో  బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.  ఎలాగూ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు.. బీజేపీని గుర్తించారని కషాయ నేతలు భావిస్తున్నారు. 

దీనికి కారణం ఇటివల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు పార్లమెంట్ స్థానాలను గెలిచుకోవటమే.  ముఖ్యంగా నిజామాబాద్ స్థానం నుండి సీఎం కేసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత ఓటమి పాలు కావడంతో తెలంగాణలో  టీఆర్ఎస్‌ బలం రోజులు గడిచేకొద్దీ తగ్గిపోతుందని అనిపిస్తోంది. పైగా  రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆలోచన  కూడా ప్రజల్లో కనిపిస్తోంది.   అందుకే కేసీఆర్ ప్రభుత్వం  విషయంలో బీజేపీ  కాస్త వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. కేంద్రం నుండి సరైన సాయం అందించకుండా... కేసీఆర్  అడిగిన నిధులను ఇవ్వకుండా.. కేసీఆర్ కి  కనీస సపోర్ట్ కూడా చెయ్యకుండా ప్రతి విషయంలో అడ్డు తగులుతుంది.  మొత్తానికి తెలంగాణలో బీజేపీ బలం బలగం పెంచటానికి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తోన్న బీజేపీ అగ్ర నాయకత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పని చెయ్యటానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, సురేష్ రెడ్డి, బోడ జనార్దన్ లాంటి వాళ్ళను  బీజేపీలో చేర్చుకున్నారు. అలాగే  కొంతమంది కాంగ్రెస్ నాయకుల కోసం పావులు కదుపుతుంది. అలాగే  తెరాస నుంచి కూడా భారీగా వలసలు ఉంటాయని తెలుస్తోంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: