ఒకవైపు సమ్మే, మరోవైపు ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులు, చెప్పలేని విధంగా మారిన విద్యార్ధుల కష్టాలు.. ఈ పరిస్దితుల్లో తెలంగాణ ప్రభుత్వం సమ్మెను విరమించే దిశగా అడుగులు ప్రారంభిస్తుందనుకున్న సమయంలో అశ్వత్థామరెడ్డి అనుకోని ట్వీస్ట్ ఇచ్చారు.. అదేమంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో తామెక్కడా వెనక్కి తగ్గలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.. ఇకపోతే కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించడానికి ఈడీలు, ఆర్థిక సలహాదారుతో తెలంగాణ సర్కారు కమిటీని ఏర్పాటు చేసింది.


ఈ సందర్భంగా అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్ట బద్ధత లేదని, చర్చల కోసం ఇప్పటి వరకు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రాలేదన్నారు. ఇక ప్రభుత్వ కమిటీ ఎవరితో చర్చిస్తుందో ముందుగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కంటి తుడుపు కమిటీలతో కాలయాపన అవుతుందన్న ఆర్టీసీ జేఏసీ నేత.. వెంటనే సంఘాల నేతలను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇకపోతే ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లతో రవాణా శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా రెండు మూడు రోజుల్లో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన ఈడీల కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఆ తర్వాత మేనేజ్‌మెంట్, ఆర్టీసీ ఎంప్లాయి యూనియన్ల మధ్య చర్చలు జరుగుతాయి.


ఇదిలా ఉండగా చర్చల దిశగా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించలేదు. కానీ తెలంగాణ సర్కారు మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కార్మికులు తమంతట తాముగా వదులుకున్నారని స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టాండ్‌లో బుధవారం నిర్వహించిన ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో పాల్గొన్న అశ్వత్థామరెడ్డి..ప్రభుత్వం చెప్పినట్టుగా.. విలీనం విషయంలో వెనక్కి తగ్గామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. కోర్టులో మేం గానీ, మా తరఫు న్యాయవాదులు గానీ.. ఆర్టీసీ విలీనం అవసరం లేదని చెప్పినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు...ఇప్పటికే నానా అవస్దలు పడుతున్న ప్రజలు వీరిపోరువల్ల ఇంకెన్ని రోజులు కష్టాలు పడవలసి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు....


మరింత సమాచారం తెలుసుకోండి: