టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా పాపులర్ అయిన
బండ్ల గణేష్ గత కొంత కాలం నుండి వివాదాల ద్వారా పాపులర్ అవుతున్నాడు. నిన్న రాత్రి
గతంలో
కడప కోర్టు
బండ్ల గణేష్ కు సమన్లు జారీ చేసినప్పటికీ
బండ్ల గణేష్ ఆ సమన్లకు స్పందించలేదు. కోర్టు
బండ్ల గణేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటంతో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం
బండ్ల గణేష్ ను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం
బండ్ల గణేష్ ను నవంబర్ నెల 4వ తేదీ వరకు రిమాండ్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ముంబైకి చెందిన ఫైనాన్షియర్ ఒకరు
బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారు. ప్రముఖ నిర్మాత పీవీపీ కూడా కొద్ది రోజుల క్రితం
బండ్ల గణేష్ పై ఫిర్యాదు చేశారు. టెంపర్
సినిమా తరువాత సినిమాలు నిర్మించని
బండ్ల గణేష్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు
సినిమా కోసం
బండ్ల గణేష్ రోజుకు 5 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది.