ఆర్టీసీ సమ్మెపై
తెలంగాణ సీఎం
కేసీఆర్ మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూర్నగర్లో
టీఆర్ఎస్ గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...పండుగ సమయంలో
rtc కార్మికులు సమ్మె చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అర్థం పర్ధం, బుద్ధిలేని సమ్మె కార్మికులు చేస్తున్నారని
కేసీఆర్ మండిపడ్డారు. ఐఏఎస్ లు చెప్పినా కాదని సమ్మెకు పోతారా అని ప్రశ్నించారు.
ఆర్టీసీ మునగక తప్పదు.. ఎవ్వడూ కాపాడలేరన్న సీఎం..ప్రస్తుతం కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే బస్టాండ్లు అమ్మే పరిస్థితిలో
ఆర్టీసీ ఉందని తెలిపారు. ఆర్టీసీని ప్రపంచంలో ఎవ్వడూ కాపాడలేడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాత ఆర్టీసీని బతికి బట్టకట్టకుండా యూనియన్లే చేశాయని
కేసీఆర్ మండిపడ్డారు. యూనియన్ల లీడర్లు అద్దె బస్సులను తొలగించాలని అంటున్నారని దాని అర్థం ఆర్టీసీని నిండా ముంచాలనా అని ప్రశ్నించారు.
ఆర్టీసీ దగ్గర రూపాయిలేని పరిస్థితి ఉందన్న కేసీఆర్..యూనియన్లు చేస్తున్న పని మహా నేరమన్నారు. సమ్మె చట్టవ్యతిరేకమని..ఆల్రెడీ ఎస్మా ఉందన్నారు. గొంతెమ్మ కోరికలతో, ఆర్టీసీని ఆగం చేసింది యూనియన్లేనని తేల్చి చెప్పారు. యూనియన్లు లేకుంటే ఆర్టీసీలోనూ భవిష్యత్తులో రూ.2లక్షల బోనస్ తీసుకునేవారన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇక వెయ్యిశాతం పాత
ఆర్టీసీ ఉండదని,
ఆర్టీసీ సమ్మెకు
ఆర్టీసీ ముగింపే జవాబు అన్నారు. డబ్బులు లేవంటే హైకోర్టు కొడుతుందా..ఆస్తులుంటే అమ్మి కట్టాలని సూచిస్తుందని వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి ఇప్పటికే రూ. 4,250 కోట్లు ఇచ్చామని తెలిపారు. బడ్జెట్ లోనూ ఎక్కువ రూపాయలు కేటాయిస్తున్నాం.. అయినా
ఆర్టీసీ బస్సులతో రోజూ రూ.3కోట్ల నష్టం
వస్తుందన్నారు. డ్యూటీ సమయంలో ట్రాఫిక్, ప్రయాణికులు ఎక్కేదగ్గర..దిగే దగ్గర కాస్త లేటే అవుతుందని.. దానికి ఎక్కువ సమయం శ్రమిస్తున్నామంటే ఎలా అన్నారు. ఓ గంట ఎక్కువ పని చేస్తే పోయిందేమిలేదన్నారు. అలా అనుకుంటే రైతు వ్యవసాయం చేయగలడా అని
ఆర్టీసీ కార్మికులనుద్దేశించి
కేసీఆర్ ప్రశ్నించారు.