భారత్లోని పంజాబ్లో ఉన్న డేరా
బాబా నానక్ గురుద్వారా నుంచి పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కర్తార్పూర్లో ఉన్న గురుద్వారా వరకు కారిడార్ను నిర్మించేందుకు సన్నాహాలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నేడు ఓ చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది.
ఈ కర్తార్పూర్ కారిడార్కు సంబంధించి ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అంతగా హడావుడి లేకుండా భారత్, పాకిస్థాన్ జీరోలైన్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం అక్టోబర్ 22న జరగాల్సి ఉంది.కొన్నిముఖ్య కారణాల వల్ల ఈ రోజు నిర్వహించారు. కర్తార్పూర కారిడార్ ఒప్పందం గురించి, గురునానక్ దేవ్550
జయంతి ఉత్సవాల సందర్భంగా ఇరుదేశాలు అత్యుతన్న స్థాయి చర్చలు జరిపారు. భారత యాత్రికులకు ఎటువంటి వీసా అవసరం లేకుండా గురుద్వారాకు అనుమతిస్తారు.
కర్తార్పూర్ కారిడార్ ఒప్పందం గురించి, గురనానక్ దేవ్ 550
జయంతి ఉత్సవాల కోసం రెండు దేశాలు అత్యున్నత స్థాయి చర్చలు జరిపారు .తాజాగా ఒప్పందం ముగిసిన సందర్భంలో కారిడార్ ని ప్రారంభించడమే మిగిలి ఉంది.వచ్చే నెల
పాక్ ప్రధాని
ఇమ్రాన్ ఖాన్ తమ భూభాగంలో ఈ మార్గాన్ని మొదలు పెడ్తున్నారని మొహమ్మద్ ఫైజల్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు.
భారత్లోని పంజాబ్లో ఉన్న డేరా
బాబా నానక్ గురుద్వారా నుంచి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కర్తార్పూర్లో ఉన్న గురుద్వారా వరకు ఈ కారిడార్ను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల అవతల ఈ గురుద్వారా ఉంది. భారత యాత్రికులకు ఎలాంటి వీసా లేకుండా గురుద్వారాకు అనుమతిస్తారు. కాకపోతే కర్తార్పూర్ సాహిబ్ నుంచి ముందస్తుగానే అనుమతి తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే,
పాకిస్తాన్ మాత్రం 20డాలర్ల సర్వీస్ చార్జ్ వసూలు చేస్తుంది అని వారు చెప్తున్నారు.