పాపం చంద్రబాబు అధికారాన్ని కోల్పోవటంతో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కావటం లేదు. వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టి అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనా సాగుతోందంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక పక్క జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తుంటే బాబు గారికి మాత్రం రాక్షస పాలనా మాదిరిగా కనిపిస్తుంది. ఎన్నికలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కనీసం 4 నెలలు కూడా కాకముందే తనను మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు. రాజధాని వ్యవహారంలో నవ్వుల పాలైవిధంగా మాట్లాడ్తున్నారు. మీడియా ముందుకు చంద్రబాబు వచ్చి అమరావతి గురించి మాట్లాడి ఇంకా కామెడీగా తయారవుతున్నారు. అసలు ఐదేళ్ల కాలంలో బాబు గారు కనీసం శాశ్వత కట్టడాలను కూడా కట్టలేకపోయారు కాబట్టి .. ప్రజలు బాబుగారిని చిత్తు చిత్తుగా ఓడించారు.


పైగా గ్రాఫిక్స్ బొమ్మలనే రాజధాని అని బాబు గారు చెప్పడంతో ప్రజలకు ఇంకా ఆగ్రహం పెరిగిపోయింది. దానితో కసితో ఎన్నికల్లో ఓడించారు. అయినా ఇంకా చంద్రబాబు తాను సృష్టించిన కలల రాజధాని పాడైపోతుందని ఇంకా మాట్లాడటం ప్రజలకు రుచించడం లేదు. రాజధాని కోసం సేకరించిన నిధులను .. బయట అప్పులను బాబు గారు చివర్లో ఎన్నికల పధకాల కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఓట్లను కొనుగోలు చేసేందుకు వాడినట్టు తెలుస్తుంది. ఇన్నీ అరాచకాలు చేసిన బాబు పైకి మాత్రం చిత్త శుద్దితో రాజధానిని నిర్మిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు.


చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి .. అమరావతి అంటూ ఎప్పుడు చూసిన బాబు గారు భజన చేసేవారు. ఈ భజన భరించలేక ప్రజలు బాబుగారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అమరావతి విషయంలో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇప్పుడేమో చంద్రబాబు నేను ఆదాయాన్ని సృష్టించే రాజధానిని నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని తెగ భాద పడిపోయారు. నిజానికి అమరావతి వల్ల ఆదాయం చేకూరింది టీడీపీ నేతలకు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: