ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయమంతా ఇసుక చుట్టూ తిరుగుతోంది. గత చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడంలోనూ ఈ ఇసుక వ్యవహారం ప్రధాన కారణమని వాదన ఉంది. ఇప్పుడు వైసీపీ హయాంలోనూ ఇసుక ప్రధాన అంశంగా మారింది. జగన్ మంత్రి వర్గంపై కూడా అప్పుడే ఇసుక వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇసుక తరలింపు విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి.


ప్రకాశం జిల్లా చినగంజాం ప్రాంతంలోని ఇసుక స్కామ్ లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడి పాత్ర ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం మరీ ఎక్కువై ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని గ్రహించిన మంత్రి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు..ఇసుక అక్రమ తరలింపు విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.


చిన్నగంజాంలో ఇసుక అక్రమ తరలింపు విషయంలో తన కుమారుడిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. గురువారం ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లనే పీపీఏలపై కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇక వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అదే విధంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని మంత్రి తెలిపారు.


అలాగే రాష్ట్రంలో ఇసుక కొరతకు వైసీపీ నేతలు కారణాలుచెబుతున్నారు. దాదాపు 10 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు లేవు. పెద్దగా వరదలు వచ్చిన దాఖలాలూ లేవు. అందువల్లే రాష్ర్టంలో అత్యధికంగా ఇసుకను అందించే నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదులకు వరదలు లేవు ప్రవాహం ఎక్కువగా లేని నదుల నుంచి ఇసుకను ఇష్టానుసారం బ్లాక్ లో అమ్ముకుంది గత టీడీపీ ప్రభుత్వం.. అని ఆరోపిస్తున్నారు.


నేడు వర్షాలు, వరదలు అధికం అయ్యాయి.రాష్ట్రంలో ప్రతి నదీ ప్రవాహంతో ఉరకలు వేస్తోంది. అలాంటప్పుడు నదుల్లోకి వెళ్లి ఇసుకను తెచ్చే పరిస్థితి అసంభవం ఇప్పటికే పదుల సంఖ్యలో వరదలు ముంచెత్తడంతో నదీతీరాలకు ఇసుక చేరవేయడం వీలు పడటం లేదు. నిండుకుండల్లా ఉన్న చెరువులు కుంటలు, కాల్వలు, చెరువులు నిండి ఇసుక తవ్వకానికి ఆటంకంగా ఉన్నాయని వివరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: