గెలుపు ముసుగులో మనం చేసే తప్పులు మనకు పెద్దవిగా కనిపించవు. ఇప్పుడు కేసీఆర్ కు అలాగే అనిపిస్తుంది. ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల గర్వం నెత్తికెక్కి కూర్చుందేమో గాని కేసీఆర్ మాటలు నియంతను తలపిస్తున్నాయంటే అతిశయెక్తి కాదు. హుజూర్ నగర్ ఎన్నికల్లో తెరాస భారీ విజయాన్ని నమోదు చేయడంతో కేసీఆర్రెట్టించిన ఉత్సహంతో .. ఇంకా చెప్పాలంటే విజయం ఇచ్చిన గర్వంతో ఆర్టీసీ సమ్మె పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉంటూ కేసీఆర్ ఇలా మాట్లాడటం ఎవరికీ నచ్చడం లేదు. కొన్ని రోజుల నుంచి ప్రభుత్వానికి ఆర్టీసీకి యూనియన్ కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతీ తెలిసిందే.


అయితే ఇప్పటికే కేసీఆర్ .. ఆర్టీసీ ఖతం అయ్యిందని కార్మికులు ఉద్యోగులే కాదని ఇంకా రెచ్చగొట్టి మాట్లాడినారు. అయితే ఇప్పుడు తాజాగా హుజూర్ నగర్ఎన్నికలో తెరాస భారీ విజయాన్ని నమోదు చేయడంతో కేసీఆర్ ప్రెస్ మీట్ లో మరీ రెచ్చిపోయి మాట్లాడినారు. నిజంగా కేసీఆర్ స్పీచ్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం రాక మానదు. ప్రజా స్వామ్యంలో ఉన్నామా .. రాచరికంలో ఉన్నామా అనే సందేహం రాక మానదు. ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే పిలిచి మాట్లాడాల్సింది పోయి .. ఆర్టీసీ ఖతం అయ్యిందని .. కార్మికుల ఉద్యోగాలు పోయాయని వారికి మళ్ళీ ఉద్యోగం కావాలంటే ధరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఎంతో హేళనగా మాట్లాడినారు.


నిజానికి కేసీఆర్ హుజూర్ నగర్ లో ఓడిపోయి ఉంటే ఇలా మాట్లాడి ఉండేవాడు కాదేమో .. కానీ హుజూర్ నగర్ లో గెలవడంతో గెలుపు మత్తులో గులాబీ అధినేత చాలా అపహేళనగా మాట్లాడుతున్నారు. ఇంకా కేసీఆర్ మాట్లాడుతూ త్వరలోనే ఆరేడు వేల బస్సులకు పర్మిట్ ఇస్తామని దీనితో ఆర్టీసీ ఇక ఉండదని .. కార్మికులను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. నిజానికి ఇటువంటి మాటలు ప్రజాస్వామ్యంలో చాలా చేటు చేస్తాయని కేసీఆర్ తొందరగా గ్రహిస్తే మంచిదే. ఎందుకంటే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: