ఉద్యోగస్తుల విషయంలో మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని తాజా సమాచారం. దీపావళి కానుకగా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు మరొక శుభసమాచారం అందిచనుందనే వార్తలు వైరల్ గా మారాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ సాధించిన వైనంకు సంతోషిస్తూ ఉద్యోగుల వేతనాన్ని పెంచాలని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ గవర్నమెంట్ ఉద్యోగుల వేతన పెంపుపై ప్రధానంగానే దృష్టి సారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


కేంద్ర ప్రభుత్వం 7వ సీపీసీ వేతన పెంపు ప్రతిపాదనపై తగిన నిర్ణయం తీసుకోబోతోందనే అంచనాలున్నాయి. ఇది జరిగినట్లయితే దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. నవంబర్‌లో జరగనున్న మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించి ఓ కొలిక్కి వస్తారట. ఇకపోతే వేతన పెంపు అంశానికి సంబంధించిన ఊహాగానాలు తప్ప ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే డీఏ ను 5% పెంచింది. అంటే 12% ఉన్న డీఏ ఇప్పుడు 17% కి పెరిగింది. అయితే ఈ పెరిగిన లెక్కలు రాబోయే జూలై నుంచి వర్తిస్తుంది.


డీఏ పెంపు వలన దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షన్ దార్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో కనీస వేతనం, ఫిట్‌మెంట్ పెంపు కోసం డిమాండ్లను చేస్తూనే వస్తున్నారు. 7వ సీపీసీ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోలేదని, ఇప్పుడు ధరలు కూడా పెరిగిపోయాయని, దీంతో వేతన పెంపు వల్ల కలిగే ప్రయోజనం చాలా తక్కువంటూ పలికారు.

నరేంద్ర మోదీ సర్కార్ ఇంతకుముందు కనీస వేతనాన్ని 18వేల రూపాయిలకు పెంచింది. అయితే ఇప్పుడు ఉద్యోగులు మాత్రం 26వేల రూపాయల కనీస వేతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం ఇందుకు ఒప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: