అగ్రిగోల్డ్‌ బాధితులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులుగా ఉన్న వారికి సంబంధించి డబ్బులు చెల్లించే కార్యక్రమం మొదలైంది. కానీ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూ. 20 వేల లోపు డిపాజిట్ దారులకు కూడా డబ్బు చెల్లించాలని నిర్ణయించారు. అగ్రిగోల్డు బాధితులకు రూ.1150 కోట్లు విడుదల చేశారు.


దీని ద్వారా అగ్రిగోల్డు బాధితులను ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిన్ననే రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. అందరికీ డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరో రూ.856 కోట్లను రెండో విడతగా నిధులు విడుదల చేసింది. మొత్తంగా రూ.1150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.


తాజా నిర్ణయంతో రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ అంటేనే ఓ నమ్మకం, విశ్వాసం ఉందని, ప్రజలంతా భరోసాతో ఉన్నారు. చంద్రబాబు ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకొని ఖాళీ ఖాజానాను వైయస్‌ జగన్‌కు అప్పగించారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అగ్రిగోల్డు బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనలతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వైయస్‌ జగన్‌ తీసుకున్న చొరవ బాధితులు ఎవరూ కూడా జీవితంలో మరిచిపోలేరు.


14 ఏళ్ల సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు, 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఈ విషయంలో ఒకసారి ఆలోచన చేయాలి వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అగ్రిగోల్డు పుట్టిందని గుర్తు చేస్తున్నారు. బాధితులను చంద్రబాబు ఆదుకునే ఆలోచన చేయలేదన్నారు. బాధితులు ఎన్ని ఉద్యమాలు చేసినా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారని ధ్వజమెత్తారు.


అగ్రిగోల్డు ఆస్తులను దోచుకునేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు కుట్రలు చేశారన్నారు. అగ్రిగోల్డు పదాన్ని ఉచ్చరించే అర్హత టీడీపీ నేతలకు లేదని వైసీపీ నేతలు హెచ్చరించారు. అగ్రిగోల్డు బాధితులను ఆదుకునేందుకు వైయస్‌ జగన్‌ రూ.1150 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అగ్రిగోల్డుబాధితులంతా కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ నెల 29న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశం ఏర్పాటు చేసి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

బే

మరింత సమాచారం తెలుసుకోండి: