వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మొదటిసారి దీపావళి పండుగాకు ప్రేక్షకులకు ఒక కనుక ఇచ్చాడు. ఆ కానుకను చూసి ప్రేక్షకులు అంత చెలరేగిపోతున్నారు. చెప్పాలంటే అది కొన్ని గంటల్లోనే వైరల్ గా మారిపోయింది. ఆ కనుక ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి ''కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా. ఆ సినిమా ట్రైలర్ ను దీపావళికి రిలీజ్ చేసి పెద్ద బాంబు పేల్చాడు. 


ఇప్పటికే కుంగి కృశించిపోతున్న చంద్రబాబుకు మరింత బాధను, కోపాన్ని తీసుకొచ్చేలా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ ఉంది. ఈ సినిమాను చూస్తే అర్థం అవుతుంది. చంద్రబాబు అంటే రామ్ గోపాల్ వర్మకు ఎంత అసహ్యం అనేది. అయితే సినిమా ఎవరి గురించి తీసినా.. అది ఎంత పెద్ద వివాదం అయినా సరే... సినిమాలోని క్యారెక్టర్స్ ని అన్నిటింని అచ్చుగుద్దినట్టు చూపిస్తాడు రామ్ గోపాల్ వర్మ. 


మొన్నటి మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ని, చంద్రబాబుని, బాలయ్యను ఇలా ఆ సినిమాలో నటించిన వారందరి పాత్రలను వారే నటించారు ఏమో అనుకునే రీతిలో చిత్రీకరించాడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు కూడా అదే బాటలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో పాత్రలను కూడా అచ్చం అలానే తీర్చిదిద్దాడు. అందులో కొన్నీ పాత్రలు నవ్వు తెప్పించిన మరికొన్ని పాత్రలు మాత్రం ఆ పాత్రకు పూర్తీ న్యాయం చేశాయి. 


వైఎస్ జగన్, చంద్రబాబుఎం విజయసాయి రెడ్డి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కె ఏ పాల్, దేవినేని ఉమా ఇలా అందరి పాత్రలు అచ్చు గుద్దినట్టు ఉన్నాయి. ఆ సినిమా ఎలా ఉంటుందో తెలీదు కానీ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ రిలీజ్ అయినా కొంత సమయానికే యూట్యూబ్ లో ట్రేండింగ్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: