మంచు విష్ణు నివాసంలో టాలీవుడ్ హీరోలు సందడి చేసారు. ఇంతకు విషయమేంటంటే ఆదివారం దీపావళి సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మంచు విష్ణు విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటుగా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇకపోతే శంషాబాద్‌లోని మంచు విష్ణు నివాసంలో ఈ హంగామా జరిగింది. ఇక టాలీవుడ్ హీరోలు మంచు విష్ణు, ప్రభాస్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ విందు కార్యక్రమం శనివారం సాయంత్రం ప్రారంభం కాగా, తెల్లవారుజాము వరకు ప్రభాస్ తో సరదాలు, సంతోషాలు కొనసాగాయని మంచు విష్ణు తెలిపారు.


దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవేకాకుండా  మంచు విష్ణు తన చిన్న కూతురు ఐరా విద్యను మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేశారు. మెగాస్టార్ ఒళ్లో తన కూతురుని పెట్టి ఆశీర్వదించమని కోరారు. ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు ముచ్చటించిన విష్ణు, విరానికా దంపతులు.. తమ గారాలపట్టిని ఆయన చేతిలో పెట్టారు. కాగా అక్కడ తీసుకున్న ఫొటోలను విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘కూలెస్ట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి అంకుల్‌కి ఐరా విద్యను పరిచయం చేశాను’’ అని తన పోస్టులో విష్ణు పేర్కొన్నారు.


ఇక విష్ణు షేర్ చేసిన ఫొటోల్లో మోహన్ బాబు, రాజారవీంద్ర కూడా ఉన్నారు. ఇకపోతే విష్ణు 2009 మార్చిలో విరానికాని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా  2011 డిసెంబ‌ర్‌లో ఈ దంప‌తుల‌కి కవల ఆడపిల్లలు జన్మించారు. వారిద్దరికి అరియానా, వివియానా అని పేరు పెట్టారు. ఆ తర్వాత వారికి 2018లో మగబిడ్డ జ‌న్మించాడు. ఆ చిన్నవాడికి అవ్‌రామ్ భక్త అని నామకరణం చేశారు. ఇక ఈ ఏడాది ఆగస్టులో నాలుగో సంతానంగా ఆడబిడ్డకు విరానికా జన్మనివ్వగా ఆ పాపకు ఐరా విద్య అని పేరు పెట్టారు. ఇకపోతే ఇప్పటివరకు విష్ణు-విరానికా దంపతులకు మొత్తం నలుగురు సంతానం...


మరింత సమాచారం తెలుసుకోండి: