ఏపీ రాజకీయల్లో జేసీ మార్క్ ఇంకా కొనసాగుతోంది. ఆయన అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఆయన నోరు తెరైస్తే చాలు తమ పక్కలో బాంబు పడ్డట్టే అన్నట్లుగా ఫీల్ అవుతారు. అది సొంత పార్టీ అయినా, ప్రత్యర్ధి పార్టీ అయినా కూడా జేసీ స్టైల్ అలాగే ఉంటుంది. అటువంటి జేసీ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇపుడు
ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కిస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుని జైలుకు పంపించేందుకు
వైసీపీ గట్టిగా ప్రయత్నం చేస్తోందని జేసీ తాజాగా ఆరోపించారు. ఈ మేరకు పెద్ద స్థాయిలో భారీ ప్లాన్ రెడీ అయిందని
జేసీ దివాకరరెడ్డి చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న
వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుందని కూడా జేసి అంటున్నారు. తాను ఈ విషయాన్ని చంద్రబాబు ద్రుష్టికి కూడా తీసుకువచ్చానని జేసీ చెప్పడం మరో విశేషం. అయితే దానికి స్పందించిన బాబు తాను ఏమీ తప్పు చేయలేదని అంటూ తమకేమీ కాదని ధీమా వ్యక్తం చేశారని జేసీ అంటున్నారు. మరి బాబుకు లేని బాధ జేసీకి ఇపుడు అర్జంట్ గా ఎందుకొచ్చిందో చూడాల్సిన విషయమే.
ఇదిలా ఉండగా జగన్ని జైల్లో పెట్టడానికి చంద్రబాబు, సోనియా
గాంధీ అప్పట్లో కుట్ర పన్నారని
వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారని జేసీ అనడం మరో విశేషం. అందులో వాస్తవం ఎంత వుందో అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న తనకు తెలియదు అని జేసీ అంటున్నారు. మొత్తానికి
జగన్ జైలుకు, బాబు జైలుకు ముడిపెట్టి
జగన్ చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ హాట్ గా మారాయి. ఏది ఏమైనా తమను ఎన్ని మాటలు అన్నా కూడా బాబుని
బీజేపీ,
మోడీ సర్కార్ సైతం
అరెస్ట్ చేయలేకపోయింది, ఇక ఓటుకు నోటు కేసులో సైతం కేసీయార్ ఎన్నో ఆర్భాటపు ప్రకటనలు చేసినా కూడా ఏమీ చేయలేకపోయారు. ఇపుడు
జగన్ ఏం చేస్తాడన్న ధీమా బాబులో ఉందని కూడా అంటున్నారు. చూడాలి రాజకీయాల్లో నిన్నటి కొలమానం నేడు రేపూ పనికిరాదు కదా.