గత కొంతకాలంగా
ఆంధ్రప్రదేశ్ లో
ఇసుక కొరత తీవ్రతరం అవుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో
ఇసుక కొరత తో భవన నిర్మాణ రంగ కార్మికులే కాకుండా భవన నిర్మాణ రంగం అనుబంధ రంగాల వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష
party TDP' target='_blank' title='టీడీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టీడీపీ పార్టీ... ప్రభుత్వం తీసుకొచ్చిన
ఇసుక విధానం పై విమర్శలకు దిగుతున్న విషయం తెలిసిందే. అయితే
నవంబర్ 3న
జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ చేపడుతున్నారు .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన
ఇసుక కొరత విధానం కారణంగా రాష్ట్రంలో 35 లక్షల భవన నిర్మాణ కార్మికులు అనుబంధ రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ క్రమంలో
విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నిరసన ప్రదర్శన కు అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు
జనసేన అధినేత
పవన్ కళ్యాణ్. అయితే
జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ చేపడుతున్న లాంగ్ మార్చ్ కి ఇప్పటికే
బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలికారు. కానీ
ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన
ఇసుక పాలసీ మీద మొదటి నుంచి పోరాటం చేసిన
party TDP' target='_blank' title='టీడీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టీడీపీ మాత్రం ఇప్పటివరకు
జనసేన లాంగ్ మార్చ్ పై స్పందించకపోవడం గమనార్హం. అయితే తాజాగా
పవన్ కళ్యాణ్ టీడీపీకి ఓ సందేశం ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని
పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు. అయితే
పవన్ కళ్యాణ్ ట్విట్ లో
party TDP' target='_blank' title='టిడిపి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టిడిపి పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.
కానీ ఇప్పటికే
బీజేపీ కమ్యూనిస్టు
పార్టీ జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ చేపడుతున్న లాంగ్ మార్చ్ కి మద్దతు తెలిపారు. కాగా లాంగ్ మార్చ్ కి మద్దతు తెలపాల్సింది
party TDP' target='_blank' title='టిడిపి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టిడిపి
పార్టీ మాత్రమే. అయితే
party TDP' target='_blank' title='టిడిపి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టిడిపి ఇప్పటికే
ఇసుక కొరత పై పోరాటలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో
పవన్ కళ్యాణ్ నిర్వహించే లాంగ్ మార్చ్ కి మద్దతు ఇవ్వాలని
party TDP' target='_blank' title='టీడీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టీడీపీ కి
పవన్ కళ్యాణ్ పరోక్షం గా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా రోజు రోజుకు తీవ్రమవుతున్న
ఇసుక కొరతతో... భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పనులు లేక ఉపాధి కరువై తినడానికి తిండి కూడా లేనంత దయనీయ స్థితిలో ఉన్నారు భవన నిర్మాణ రంగ కార్మికులు.