శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో సోమవారం అంటే అక్టోబర్ 28న స్వామిజీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ‘తిరునక్షత్రోత్సవ వేడుకలు’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని, స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చినజీయర్ స్వామీజీతో తన అనుబంధం గురించిన  పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..


ఆదేమంటే చినజీయర్ స్వామీజీ ముఖ్య అతిథిగా 1986-87లో సిద్ధిపేటలో బ్రహ్మయజ్ఞం తలపెట్టారు. ఆ సమయంలో సిద్ధిపేట ప్రాంతంలో బ్రాహ్మణ పరిషత్ లేదు. అప్పుడు సిద్దిపేటకు వచ్చే చినజీయర్‌ స్వామి వారు ఎక్కడ బస చేస్తారనే సంశయం తలెత్తింది. దీంతో గ్రామస్థులు వచ్చి చినజీయర్‌ స్వామిని మా ఇంట్లోనే ఉంచాలని కోరారు.


సరే వారి ఆలోచన బాగుంది కాని  అంతకు ముందెప్పుడూ స్వామీజీతో నాకు పరిచయం లేదు. ఎలాగా అని ఆలోచిస్తున్న తరుణంలో వికాస తరంగిణి మిత్రులు నా వద్దకు వచ్చి.. ఇదొక మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమం ముగిసేవరకు స్వామివారికి మీ ఇల్లు ఐతేనే బాగుంటుందనగా కాసేపు ఆలోచించి ఇది దైవ నిర్ణయంగా భావిస్తున్నాను  అంతకంటే అదృష్టం ఏముంటుందని నేను సరే అన్నాను.


ఇకపోతే స్వామివారిని మా యింటికి రావాలని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహించారని కేసీఆర్ తెలిపారు.. అప్పటినుండి ఏడురోజుల పాటుగా  చినజీయర్‌ స్వామి తమ ఇంట్లోనే బస చేశారని, ఆ సమయంలో నేను స్వామీజీకి కారు డ్రైవర్‌గా మారిపోవడం, పలు ఆలయాలకు తిరగడం జరిగింది. అలా ఏడెనిమిది రోజులు నేనే కారును నడపటం చేసే వాన్ని, ఇక స్వామీజీతో పాటే ఉండటంతో ఆయన నుండి చాలా విషయాలు తెలుసుకున్నా. స్వామీజీ చేసిన అనుగ్రహ భాషణలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి  అని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: