దగ్గర దగ్గరగా నెల రోజులుగా కొనసాగుతున్న తెలంగణారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె రాష్ట్రంలో జన జీవనం అస్థవ్యస్తం అయిందని చెప్పక తప్పదు. సామాన్యుని బ్రతుకు దినదినానికి దుర్భరంగా మారిపోతుంది. ప్రజా రవాణా దాదాపుగా మూతపడింది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సున్నితంగా హెచ్చరించినా మార్పు అనేది ముఖ్యమంత్రిలో కలికానికి కూడా కనిపించని వేళ - 'సకల జనుల సమర భేరి' అనే కీలక ఘట్టం చోటుచేసుకుంది.


ప్రభుత్వం మొండిపట్టు - చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో, ఆర్టీసీ కార్మికులు నీరుగారి పోకుండా, కార్మికుల్లో ఆత్మస్థైర్యం కల్పించాలన్న లక్ష్యంతో “ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ - సకల జనుల సమర భేరి” అంటూ హైదరాబాద్ సరూర్ నగర్లో సభను నిర్వహించగా, అది కాస్తా మలుపు తీసుకోని కీలకఘట్టంగా రానున్న రాజకీయ చరిత్రలో నిలువబోతుందా? అన్నట్లు విజయవంతమైంది. 

sakala janula samara bheri కోసం చిత్ర ఫలితం

తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒంటరిగా – ప్రతిపక్షాలన్నీ ఐకమత్యమైనట్లు ఇరుపక్షాల మద్య స్పష్టమైన గీత ఏర్పడింది. ఆర్టీసీ కార్మికుల కు అన్ని విపక్షాలు - ప్రజాసంఘాలు అండగా ఉన్నాయని ఈ సభ స్పష్టం చేసింది. ఈ సభ నేపథ్యంలో కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రంగా – మరోసారి తెలంగాణా నిలవబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.  


ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన “సకల జనుల సమర భేరీ” కి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.  ఉపాధ్యాయ - కార్మిక సంఘాలతో పాటుగా ఆయా రాజకీయ పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేకించి తెలంగాణా రాష్ట్రావతరణకు మూలస్థంబంగా నిలిచి ఆ కలసాకారం చేసిన సమర రధుడు తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్  కోదండరాం ఈ ఆర్టీసీ సమ్మెను సకల జనుల సమ్మెగా మార్చటానికి మరో సారి టాంక్ బండ్ పై “మిలియన్ మార్చ్” నిర్వహించటానికి ఉద్యుక్తులౌతున్నారు.

sakala janula samara bheri కోసం చిత్ర ఫలితం

*కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సకల జనుల సమ్మెకు సమైక్య పాలకులు అనుమతిస్తే, ఇపుడు సభ పెట్టుకుంటామంటే కేసీఆర్ ఆద్వర్యం లోని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం  అనుమతి ని ఇవ్వకపోవటంలోని ఔచిత్యం ఏమిటని మండిపడ్డారు.

*టిఎస్ - ఆర్టీసీ నష్టాల్లో లేదని, బలవంతాన ఒక వ్యూహంతో నష్టాల్లోకి నెట్టివేయబడిందన్నారు. విమానంలో పోసే పెట్రోల్ కు ఒక శాతం జీఎస్టి వసూలు చేస్తున్న కేసీఆర్, ఇవాళ నిరుపేదల రవాణాగా పేరొందిన ఎర్రబస్సుకు 27 శాతం జీఎస్టి వసూలు చేస్తున్నారని విమర్శించారు.

*విభజనం చట్టం ప్రకారం ఆర్టీసీ ఆస్తులు - అప్పులు పంపకం ఇంకా జరగలేదంటున్నారు కాబట్టి ఏపీలో తీసుకున్న విలీన నిర్ణయం తెలంగాణలో కూడా వర్తిస్తుందని అన్నారు. ఎర్రబెల్లి అనే ఊసర వెల్లి ఆర్టీసీ విలీనం తమ అజెండాలో ఉందా? అని తన అఙ్జానాన్ని మరోసారి ప్రదర్శించారని అన్నారు.

*ఆర్టీసీ ప్రైవేటీకరిస్తామని మీ మేనిఫేస్టో లో చెప్పారా? అని ప్రశ్నించారు రేవంత్.  20 శాతం మెఘా కృష్ణారెడ్డికి కట్టబెడతామని మీ మేనిఫెస్టోలో చెప్పారా? అని అన్నారు. తప్పుడు నివేదికలతో రాష్ట్ర హైకోర్టును కూడా పక్కదారి పట్టించ జూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

 

బీజేపీ నేత వివేక్ మాట్లాడుతూ, ఆర్టీసి కార్మికుల్లో చీలిక తీసుకొచ్చేందుకు శతవిధాలా మంత్రులు - ఎమ్మెల్యేలు ప్రయత్నించారని ఆరోపించారు.  కానీ మీరంతా ఐఖ్యంగా సమ్మె చేసి, ఐక్యత అంటే ఏంటో నిరూపించారని కొనియాడారు. కార్మికులకు ₹ 50000 జీతం వస్తుందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమకు ₹20000 మాత్రమే వస్తుందని కార్మికులు చెబుతున్నారన్నారు. ఇప్పటివరకు కార్మికులు కష్టపడి ఆర్టీసీని కాపాడుకుంటు వస్తున్నారన్నారు.  డాదాపు నేల రోజులుగా కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే, ప్రజలు సాధారణ రవాణా లేకుండా వెతలకు గురౌతుంటే ముఖ్యమంత్రి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

sakala janula samara bheri కోసం చిత్ర ఫలితం 

టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. అదే మరోసారి ట్యాంక్ బండ్ పై “మిలియన్ మార్చ్”

*ఇప్పటి వరకు 15 మంది ఆర్టీసీ కార్మికులని కేసీఆర్ ప్రభుత్వం బలితీసుకుందని, ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారని ప్రశ్నించారు.

*ఆర్టీసీ కార్మికులు జీతాలు అడగటం లేదని, ఆర్టీసి సంస్థను బతికించాలని కోరుతున్నారని అన్నారు.

*ఇది మామూలు సమ్మె కాదని, ప్రజా సంపదను - ఆర్టీసీ ఆస్తులను కాపాడటానికి చేస్తున్న సమ్మె అన్నారు.

*ప్రస్తుత పరిస్తితుల్లో ప్రభుత్వంలో విలీనం అయితే తప్ప ఆర్టీసీ బతకదని తెలిపారు.

*ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుంటే..మరోసారి ట్యాంక్ బండ్ పై “మిలియన్ మార్చ్” నిర్వహిస్తామన్నారు.

sakala janula samara bheri కోసం చిత్ర ఫలితం

తమకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల గత నెలరోజుల నుంచి జీతాలు లేవని, కానీ తమ సమస్యల సాదనం కోసం ఇబ్బందులు తప్పవన్నారు.  కాగా ఈ సకల జనుల భేరీ పై టీఆర్ఎస్ పార్టీ స్పందించ లేదు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై సహజంగానే జనంలో ఆసక్తి నెలకొంది. అయితే - ఇటు ప్రభుత్వవర్గాలు - అటు పార్టీ వర్గాల ద్వారా సభ గురించి గులాబీ పెద్దలు అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి - కొండా విశ్వేశ్వర్ రెడ్డి - వీహెచ్ - బీజేపీ నుంచి వివేక్ - జితేందర్ రెడ్డి - టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ - వామపక్షనేతలు తదితరులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: