కామా తురానాం న భయం న లజ్జ అంటారు..ఇటీవల కాలంలో లైంగిక వాంఛ కోసం కట్టుకున్న భర్త, కన్న పిల్లలను చంపేస్తున్నారు కొంత మంది ఆడవాళ్లు.  జీవితాంతం నీకు తోడుగా ఉంటూ దైవసాక్షిగా ప్రమాణం చేసిన భార్యను ప్రియురాలి కోసం దారుణంగా హతమారుస్తున్నారు మగాళ్లు.  కేవలం కామ వాంఛకోసం ఐనవాళ్లను, నమ్మిన వాళ్లను దారుణంగా చంపేస్తున్నారు. గత మూడేళ్ల లో తెలుగు రాష్ట్రాల్లో అక్రమ సంబంధం నేపథ్యంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయి. ప్రియుడి కోసం ఏకంగా భర్తని చంపిన ఘటనలు.. ప్రియురాళి కోసం కట్టుకున్న భార్యను దారుణంగా చంపిన ఘటనలు..ప్రియుడి కోసం కన్న పిల్లలనే కడతేర్చిన కేసులు ఎన్నో నమోదు అయ్యాయి.  తాజాగా నవమాసాలు మోసి 20 ఏళ్ల పాటు పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని ఓ కూతురు కామ వాంఛ కోసం ప్రియుడి మాటలు విని దారుణంగా హతమార్చింది. మానవత్వం కూడా సిగ్గుపడే ఈ ఘటన రాజధాని హైదరాబాద్‌లో జరిగింది.

 రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి, రజిత హయత్ నగర్ కి వచ్చి సొంత ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు.  వీరికి ఒక్క కుమార్తె కీర్తిరెడ్డి. ఈ మద్య  పక్కనే ఉంటున్న బాల్ రెడ్డితో ప్రేమాయణం నడిపించి అతని వల్ల గర్భం దాల్చింది.  ఆ గర్భాన్ని తొలగించుకోవడానికి కీర్తిరెడ్డి, బాల్ రెడ్డి వారి ఇంటి వద్ద ఉన్న మరో యువకుడు శిశికుమార్ సహాయాన్ని తీసుకున్నారు.  అయితే కీర్తి రెడ్డి వీక్ పాయింట్ తెలుసుకున్న శశికుమార్ ఆమెను లోబర్చుకొని బాల్ రెడ్డికి దూరం చేయాలని చూశాడు. 

ఈ వ్యవహారంలో కీర్తి తల్లి రజిత ఇద్దరినీ మందలించడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్లాన్ తో కీర్తికి మందు తాగించిన..ఆమె హాట్ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి మొత్తానికి కన్నతల్లినే చంపెలా చేశాడు. ఆ తర్వాత వారిద్దరు రజిత మృతదేహాన్ని యాదాద్రి జిల్లా రామన్నపేట రైల్వేగేటు వద్ద పడవేశారు.  ఈ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో పెన సంచలనం రేపింది.  ఇక   ప్రేమికుడిని పంపిస్తే గానీ ఇంట్లో బంధించిన కుటుంబ సభ్యులను వదలనంటూ ఓ బాలిక వెర్రి వేషాలు వేసింది.  నాలుగు గంటలపాటు పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు పెట్టింది.

ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. పలమనేరు నాగలరాళ్లవీధికి చెందిన బాలిక ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గతంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తోన్న ఓ యువకుడితో పరిచయం అయ్యింది. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. కలిసి చెట్టపట్టాలేసుకొని తిరిగారు.పెళ్లి చేసుకోవాలని భావించి.. పెద్దలు ఒప్పుకోకరనే భయంతో ఏడాది క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యువకుడిపై కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో యువకుడు కూడా వెనక్కు తగ్గాడు.

ఈ క్రమంలో తన పేరెంట్స్ ని ఇంట్లో బంధించి తాళం వేసి బయటకు వచ్చి పిచ్చిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు రావడం..అధికారులు జోక్యంతో  2020 ఏప్రిల్‌ నెలలో మైనారిటీ తీరుతుందని బాలికకు సర్థి చెప్పారు. తర్వాత ఇష్టమైన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పడంతో బాలిక వెనక్కు తగ్గింది. ప్రియుడి కోసం కన్న కొడుకునే ఓ తల్లి హత్య చేసింది. ఆ మద్య హరియాణా రాష్ట్రంలోని జజ్జర్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  జిల్లాకు చెందిన మీనా (44) అనే మహిళ తన కొడుకు ప్రమోద్‌(23)తో గురుగ్రామ్‌లో నివాసముంటోంది.

ప్రమోద్ స్నేహితుడు ప్రదీప్ అప్పుడప్పుడు వారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ప్రమోద్‌ తల్లితో అతనికి పరిచయం ఏర్పడి, అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రమోద్‌ కొన్ని రోజులుగా విధులకు వెళ్లడం మానేసి, ఇంటి వద్దనే ఉంటున్నాడు. దాంతో కొడుకు అడ్డు తొలగించుకు నేందుకు ప్రియుడితో కలిసి కన్న కొడుకేనే హత్య చేసింది. ఇలా దేశంలో ఎన్నో అక్రమ సంబంధాల నేపథ్యంలో నేరాలు జరుగుతున్నాయి. కామంతో రెచ్చిపోతున్న ఇలాంటి మానవ మృగాళ్లు సమాజం, చట్టం క్షమించినా ఆ భగవంతుడు మాత్రం క్షమించరని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: