ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. ఈ గ్యాంగ్‌రేప్‌ సంఘటన  అందరిలోను కలకలం రేపింది. నమ్మివచ్చిన యువతిని బాలుడు వంచించి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన  వెలుగులోకి రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమె స్పృహ‌త‌ప్పిన తర్వాత అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురిలో ముగ్గురు మైనర్లు, ఒక యువకుడు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


విశాఖపట్నం నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం కైలాసగిరి కొండపై యువతిపై అత్యాచారం కలకలం రేపింది. సుమారు 22 ఏళ్ల యువతిని ఓ బాలుడు కైలాసగిరి కొండపైకి తీసుకొని పోయాడు. అక్కడ వారిద్దరూ కొద్దిసేపు అటూ ఇటూ సరదాగా గడపడం జరిగింది. తర్వాత  ఓ ప్రదేశంలో కూర్చోవడం జరిగింది. ఇంతలోనే  ఆ బాలుడు యువతికి  మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇవ్వడం జరిగింది. అందులో మత్తుమందు కలిపిన విషయం తెలియని యువతి కూల్‌డ్రింక్ తాగడంతో మత్తులోకి జారుకోవడం జరిగింది.


యువతి స్పృహ‌ కోల్పోవడంతో బాలుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత తన ముగ్గురు స్నేహితులను ఆ ప్రదేశానికి పిలిపించాడు. ఆ ముగ్గురు కూడా యువతిని అత్యాచారం చేయడం జరిగింది. వారిలో ఇద్దరు మైనర్లు కాగా మరో యువకుడు గురివిల్లి రమణ అత్యాచారానికి పాల్పడిన వారిలో ఉన్నారు అని సమాచారం . సాధారణ తనిఖీల్లో భాగంగా అటుగా వెళ్లిన పోలీసులకు బాలురపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకోని విచారణ చేయడం జరిగింది.

విషయం తెలుసుకొని అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించడం జరిగింది. పోలీసులు నిందితులు నలుగురిపై అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. నిందితులు నలుగురు కూడా  నగరానికి సమీపంలోని జోడుగుళ్లపాలేనికి చెందినవారుగా సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: