పొద్దున లేచింది మొదలు ఏ సుప్రభాతమో విందామనుకుని టీవి ఆన్ చేస్తే చాలు రేపులు, మర్డర్లు ,ఆత్మహత్యలు ఇవే విషయాలు అన్ని చోట్ల వినిపిస్తున్నాయి. ఈ వార్తలే పేపర్లో ప్రతి పేజీలో కనిపిస్తున్నాయి. ఈ లోకంలో మనిషి కళ్లను ఆవహించిన మాయకు డబ్బు తప్ప మరేది కనిపించడం లేదు. ఇక మోహంతో అల్లాడిపోయో దేహంలో కామం అణువణువు నిండిపోయి కన్ను మిన్ను కంటికి కానరాక కనిపించిన స్త్రీ  లను కామంతో చూస్తూ, వావివరసలు మరచి మనషులు వ్యవహరిస్తున్నారు. ఎలాగంటే అడవిలో సంచరించే మృగాలకంటే అధ్యాన్నంగా మారిపోయారు.


సమాజం ఎలా తయారైందంటే తోడబుట్టిన చెళ్లెల్ల వెంట ఎటైన వెళ్లినా, కట్టుకున్న భార్యతో దూర ప్రయాణం చేసిన భయపడే పరిస్దితులు నెలకొంటున్నాయి. అసలు ఆడపిల్లలుగా పుట్టిన వారు ఒంటరిగా తిరగాలంటే వణికిపోయే ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇక ఇలాంటి సంఘటనే విశాఖలో జరిగింది. ఓ యువతిపై ముగ్గురు బాలురు, ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అత్యంత దారుణమైన ఈ ఘటనకు సాక్షిగా ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కైలాసగిరి నిలిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ యువతి బాలుడితో కలిసి కైలాసగిరికి చేరుకుంది. కొండపై కాసేపు చక్కర్లు కొట్టిన తర్వాత ఇద్దరూ ఓ ప్రదేశంలో కూర్చుని కూల్‌డ్రింక్ తాగారు. అయితే బాలుడు ఇచ్చిన కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపిన విషయం తెలియని ఆమె అది తాగిన తర్వాత మత్తులోకి జారుకుంది. ఇదే అదనుగా భావించి ఆ బాలుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న అతని స్నేహితులు సైతం ఆమెపై దారుణానికి ఒడిగట్టారు.


అయితే పెట్రోలింగ్ చేస్తూ అటుగా వచ్చిన పోలీసులకు ఆ బాలుడు కనిపించడంతో ఇక్కడేం చేస్తున్నావని, ఆ అమ్మాయి ఎవరని అడగ్గా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అతనిపై  పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అసలు విషయం బయటపడటంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.. ఇక బాలుడు చెప్పిన వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లతో పాటు గురివిల్లి రమణ అనే యువకుడ్ని అరెస్ట్ చేశారు. వీరంతా జోడుగుళ్లపాలేనికి చెందిన వారిగా గుర్తించారు. ఇక కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: